Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
Tulsidas Jayanti 2021:తులసీదాస్ తల్లిదండ్రులను ఎందుకు వదిలిపెట్టారంటే...
తులసి దాస్ జయంతి 2021 తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రామయాణాన్ని రచించింది ఎవరంటే మనమంతా టక్కున చెప్పే పేరు వాల్మీకి. అయితే తులసీదాస్ తన రామచరిత్రమానంలో శ్రీరాముని కథను మరోసారి పునరావ్రుతం చేశాడు. గోస్వామి తులసీదాసుగా ప్రసిద్ధి చెందిన ఈయన గొప్ప సాధువు, కవి మరియు రచయిత. తులసీదాస్ శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఏడో రోజున జన్మించారు. ఈ ఏడాది 2021 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన తులసీదాస్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. హిందీ మరియు సంస్క్రుత సాహిత్యానికి తులసీదాస్ తన వంతు సహకారం అందించారు. భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తులసీ దాస్ ముఖ్య రచనలు..
రామచరిత్రమానాలతో పాటు తులసీదాస్ జీ పవిత్రమైన హనుమాన్ చాలీసాను కూడా రచించారు. హనుమాన్ చాలీసా హనుమంతునికి అంకితం చేయబడింది. ప్రసిద్ధ సంకట్ మోచన్ ఆలయాన్ని తులసీదాస్ జీనే స్థాపించారు. ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలోనే భజరంగ్ బలి స్వయంగా తులసీదాస్ కు దర్శనం ఇచ్చారని చెబుతుంటారు. దీంతో పాటు ఈయన రాంలీలా కూడా ప్రారంభించారు.
తులసీదాస్ పుట్టుక రహస్యాలు..
తులసీదాస్ జీ తన జీవితంలో ఎక్కువ భాగం బనారస్ లోని గంగా తీరంలో గడిపారు. నేడు ఆ ప్రదేశాన్ని తులసీ ఘాట్ అని పిలుస్తారు. తులసీదాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలోని సుకర్ క్షేత్ర గ్రామంలో జన్మించారు. తులసీదాస్ జీ తన తల్లి గర్భంలో పన్నెండు నెలలు గడిపిన తర్వాత జన్మించాడని చెబుతారు. సాధారణంగా ఎవరైన పుట్టిన తర్వాత ఏడుస్తారు. కానీ తులసీ దాస్ మాత్రం పుట్టినప్పుడు అస్సలు ఏడవలేదట. అంతేకాదు తను పుట్టిన వెంటనే ఐదు నెలల బాలుడిలా కనిపించాడట. బయటకు వచ్చినప్పుడే పూర్తి 30 దంతాలతో జన్మించాడని పండితులు చెబుతారు.

జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసీదాస్ జీ అభూక్త మూల నక్షత్రంలో జన్మించాడు. అంటే అది తన తండ్రి అశుభ సంకేతం. దీని కారణంగా తులసీదాస్ పుట్టిన నాలుగు రోజులకే తన తల్లి మరియు తండ్రి తనను చునియా అనే మహిళకు అప్పగించారు. చునియా తులసీదాస్ ని ఐదేళ్ల పాటు పెంచిన తర్వాత మరణించింది. దీని తర్వాత తులసీదాస్ జీ యాచించే స్థితికి వచ్చారు. చునియా మరణం తర్వాత తల్లి పార్వతీ స్వయంగా తులసీదాస్ జీకి ఆహారం ఇచ్చేందుకు ప్రతిరోజూ సాయంత్రం వచ్చేదని చెబుతుంటారు.
నరహరిదాస్ రామాయణ కథ..
తొలిరోజుల్లో తులసీదాస్ జీ పేరు రాంబోలా. ఎందుకంటే తను పుట్టినప్పుడు రామ్ పేరు తీసుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వినయ్ అనే పత్రికలో చెప్పారు. తన గురువు నరహరిదాస్ నాలుగో శిష్యుడు. చునియా మరణించిన కొద్దికాలానికి ఈయన తులసీదాస్ ను దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిని తనతో పాటు అయోధ్యకు తీసుకెళ్లి అక్కడ రామాయణ కథను తులసీదాసుకి చెప్పాడు. తులసీదాస్ తన ఉల్లేఖానాలలో, తన గురువు తనకు రామాయణాన్ని చెప్పినప్పుడు, తనకు అర్థం కాలేదు. కానీ పెరిగి పెద్దయ్యేలోపు ఆ పవిత్ర గ్రంథం పాఠాన్ని అర్థం చేసుకున్నానని చెప్పాడు.
తులసీదాస్ వివాహ జీవితం..
తులసీదాస్ జీ వివాహం కథ చాలా ప్రసిద్ధి గాంచింది. ఆ కథనం ప్రకారం తులసీదాస్ జీ బ్రాహ్మణ కుమార్తె రత్నావళిని వివాహం చేసుకున్నారు. ఓసారి హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు రత్నావళి తన సోదరునితో తన తల్లి ఇంటికి వెళ్లారు. అదే రాత్రి తులసీదాస్ తనను కలవడానికి అక్కడి చేరుకున్నాడు. అక్కడ తులసీదాస్ ని చూసి రత్నావళి చాలా ఆశ్చర్యపోయింది. ఆయన తన శరీరం పట్ల కలిగి ఉన్న ప్రేమలో సగం కూడా దేవుడిని ప్రేమిస్తే వారు దేవుని దీవెనలు పొందుతారని వారికి చెప్పాడు. దీంతో తన భార్య తులసీదాస్ ను తిట్టింది. దీంతో తను వివాహ జీవితానికి వీడ్కోలు పలికాడు. తర్వాత ప్రయాగ్ రాజ్ నగరానికి వెళ్లారు.
తులసీదాస్ గురించి కొన్ని కథలు అందుబాటులో ఉన్నాయి. మరో కథనం ప్రకారం.. తను బాల్యం నుండి ఒక సాధువు అని జీవితాంతం తను బ్రహ్మాచారిగా ఉండిపోయాడు. తను శ్రీరాముడిని మరియు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకుంటాడని చెబుతారు.



Click it and Unblock the Notifications