Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
ఈమెనే ఇండియాలో అత్యంత అందమైన అమ్మాయి.. ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ మొత్తం షేక్!
ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. అఘోరీలు, వారి దుస్తులు, ప్రయాగ్రాజ్లోని విలాసవంతమైన టెంట్లు, కుంభమేళా కోసం వచ్చిన విదేశీయులు, ఏర్పాట్లు అన్నీ సోషల్ సైట్లలో ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రయాగ్రాజ్లోని ప్రతి సన్నివేశం సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
లక్షలాది మంది సాధువులు, సన్యాసులకు పుణ్యభూమి అయిన ప్రయాగ్రాజ్లో.. ఓ సాధారణ మహిళ ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. నిజం చెప్పాలంటే ఆమె పెద్ద పెద్ద హీరోయిన్ల కంటే అందంగా ఉన్నారు. అసలు ఇంతకీ ఆమె ఎవరు? ఆమె వృత్తి ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆమె ఎవరంటే?
ఆ అందమైన అమ్మాయి పేరు మోనాలిసా. ఆమె కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుంటున్నారు. అక్కడికి వెళ్లిన కొందరు ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఆమె వీడియోలు తీయడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ దర్శకులు వచ్చి నటించమని అడగడం కూడా ఆశ్చర్యం కలిగించదని చెప్పుకోవచ్చు.
ఐశ్వర్యారాయ్ కళ్ళ మాదిరిగానే
ఇప్పుడు తెగ వైరల్గా మారిన ఆ యువతి కళ్ళు ఐశ్వర్యారాయ్ కళ్ళ మాదిరిగానే ఉంటుంది. నీలిరంగులో చాలా ఘాటుగా, లోతుగా ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి. ఐశ్వర్యారాయ్ కళ్ళ తరువాత అంతటి అందమైన కళ్ళు ఈ సుందరికే సొంతమనడంలో అతిశయోక్తి లేదు. ఆమె కళ్ళను చూసిన ప్రతిఒక్కరూ ఆమెకు ఫిదా ఐపోతున్నారు. ఆమెతో ప్రేమలో పడిపోతున్నారు.
పెద్దగా చదువు లేదు..
మోనాలిసా తాను పెద్దగా చదువుకోలేదని, ఏదైనా జాతర లేదా కుంభమేళా జరిగినప్పుడు అక్కడికెళ్లి వస్తువులు అమ్ముకుంటానని చెప్పుకొచ్చింది. కుంభమేళాలో వ్యాపారం కోసం ఇండోర్ నుండి తన బృందంతో అక్కడికి వచ్చానని తెలిపింది. అంతే అక్కడ ఆమె ఫోటోలు వైరల్ కావడంతో.. కేవలం 24 గంటల్లోనే ఆమె నేషనల్ క్రష్ అయ్యింది.
జాగ్రత్త ముఖ్యం
ఈ సోషల్ మీడియా ఎవరినైనా సెలబ్రిటీని చేయగలదు. కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీ జీవితం నాశనం అవుతుంది. ఆమె ఇప్పుడు తన స్వంత పనిని చేసి ఆనందాన్ని పొందుతుంది. కానీ ఫేమస్ అయ్యాక.. ఆమె వ్యాపారం చేయడం కంటే ఆమెతో మాట్లాడే వారికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా మారింది. అందుకే సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుండేది.



Click it and Unblock the Notifications