వామ్మో ఇండియాలో అతి భయంకరమైన వింత వ్యాధి.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

కరోనా మహమ్మారి ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజలు జంకుతున్నారు. ఏదైనా వ్యాధి పేరు వస్తేనే చాలు అందరూ హడలెత్తిపోతున్నారు. చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే చాలు ఆసుపత్రులకు పరిగెత్తుతున్నారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ప్రజల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇటీవల అక్కడ కనిపిస్తున్న లక్షణాలు స్థానికులను మాత్రమే కాకుండా వైద్య నిపుణులను, అధికారులను కూడా భయభ్రాంతులను గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆ ప్రాంతంలో జుట్టు రాలిపోవడం ప్రధానంగా చర్చనీయాంశంగా ఉండగా, ఇప్పుడు గోళ్ల ఊడిపోవడం అనే కొత్త సమస్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఆ గ్రామంలో ఎందుకు వింత వింత రోగాలు వస్తున్నాయి? దానికి కారణం ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అక్కడ ఏం జరుగుతోంది?

మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లా, ముఖ్యంగా షెగావ్ పరిధిలోని నాలుగు గ్రామాల్లో ప్రజలు చెయ్యి, కాళ్ల గోళ్లు వాటంతట అవే రాలిపోవడంతో తీవ్రంగా బాధపడుతున్నారు. అలాగే గోళ్లు ముడుచుకుపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరికి గోళ్లు పూర్తిగా ఊడిపోతుండగా, మరికొందరికి చర్మం లోపలికి నెట్టినట్లు అనిపించే ప్రభావాలు కనిపిస్తున్నాయి.

Mysterious disease in maharastra Here is more details about it

వైద్య పరీక్షలు, ప్రాథమిక అంచనాలు

ఈ ఆరోగ్య సమస్యల తీవ్రత దృష్ట్యా, అధికారులు వెంటనే స్పందించి స్థానికులను షెగావ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి గోళ్లు, జుట్టు నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ప్రాథమికంగా వైద్యులు భావిస్తున్నది ఏంటంటే అక్కడి ప్రజల శరీరాల్లో సెలీనియం మోతాదు అనూహ్యంగా పెరిగిందని తెలుసుకున్నారు. దీని కారణంగా ఈ పరిస్థితులు తలెత్తినట్లు. పేర్కొన్నారు. అయితే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. అయినా సరే, దీని వెనుక గల అసలు కారణాలను గుర్తించి తగిన చికిత్స అందించేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

ఆహారపు అలవాట్లదే కారణమా?

కొంతమంది న్యూట్రీషన్ నిపుణులు, ఈ సమస్య తలెత్తడానికి ప్రజలు ఎక్కువగా గోధుమ ఆధారిత ఆహారం తీసుకోవడమే అని చెబుతున్నారు. గోధుమల్లో సహజంగా ఉండే సెలీనియం, కొంతమందిలో ఎక్కువ మోతాదులో చేరినప్పుడు జుట్టు, గోళ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే, ప్రతి వ్యక్తికి ఇది ఒకేలా ఉండదు. జీవనశైలి, జీర్ణ వ్యవస్థ, ఇతర పోషకాల్లో లోపం వంటి అంశాలపై ఆధారపడి ఇది మారుతూ ఉంటుంది.

తదుపరి చర్యలు ఏంటంటే..

ప్రభుత్వ వైద్యశాఖ ఇప్పటివరకు ఈ సమస్యపై లోతుగా పరిశోధన ప్రారంభించిందని సమాచారం. శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో జాతీయ స్థాయి నిపుణుల సహకారం తీసుకుంటున్నారట. ప్రజలకేమైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే, తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అలాగే అసంతులిత ఆహారం తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.

సూచనలు:

గోధుమ, ఇతర ఆహారాల్లో సమతుల్యత పాటించాలి
సెలీనియం అధిక మోతాదులో ఉన్న ఆహారాలు నిర్దిష్టంగా తెలుసుకొని తీసుకోవాలి
శరీరంలో మార్పులు గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి
ఆరోగ్యపరంగా నూతన లక్షణాలపై అధికారుల దృష్టికి తీసుకురావాలి

ముగింపు

మహారాష్ట్ర గ్రామాల్లో వెలుగులోకి వస్తున్న ఈ కొత్త ఆరోగ్య సమస్యల గురించి ఇప్పటికీ పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ప్రాథమికంగా ఇది వ్యాధి కంటే పోషక లోపం వల్ల ఏర్పడిన సమస్యే అని అర్థమవుతోంది. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికలు వెలువడతాయని, ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు అందించబడతాయని అధికారులు తెలియజేశారు.

Story first published: Saturday, April 19, 2025, 12:14 [IST]
Desktop Bottom Promotion