Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఇండియాలో ఇస్లాం మతస్థుల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇండియాలో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారు. ముస్లిం అంటే ఇస్లాంను అనుసరించేవాడని అర్థం. ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లింలు ఆచరిస్తారు. ముస్లింలు పరస్పరం ఒకరికి ఒకరు సలాము చేసుకుంటారు. ఇది వాళ్ల ఆచారం. ఈ ఆచారం వాళ్లకు చాలా ముఖ్యమైనది. ఇండియాలో ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు. అయితే ముస్లింల గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని ఆశ్చర్యకర విషయాలున్నాయి. అవేంటో చూద్దాం..

రెండో పెద్ద మతం
ఇస్లాం ఇండియాలో రెండో పెద్ద మతం. దేశంలోని జనాభాలో 172 మిలియన్ల మంది ముస్లింలున్నారు. దేశ జనాభాలో 14.2 శాతం అన్నమాట.

కాశ్మీర్ లో ఎక్కువ
ముస్లింలు ఎక్కువగా జమ్మూ, కాశ్మీర్, లక్షద్వీప్ దీవులలో ఉన్నారు. 110 మైనార్టీ కేంద్రీకృతమైన జిల్లాలలో కనీసం ఐదో స్థానంలో ముస్లింలు ఉంటారు.

ఎక్కువ సంతానోత్పత్తి
ఇండియాలో ఉన్న ఇతర మతాలతో పోల్చితే ముస్లింలలో ఎక్కువ సంతానోత్పత్తి ఉంది. అందుకే ఇండియాలో ముస్లింల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉంది. 1951లో 10 శాతం ముస్లింలు ఉండగా.. 2013కి 14.4 శాతానికి పెరిగింది.

ముస్లింలలో ప్రముఖులు
దేశంలో ఇప్పటివరకు 12 మంది రాష్ర్టపతులు ఉంటే..అందులో ముగ్గురు ముస్లింలున్నారు. జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్, ఏపీజే అబ్దుల్ కలాం.

ఇండియన్ ఫోర్స్
భారతదేశంలో ఆర్మీ ఫోర్స్ లో ముస్లింలే ముందంజలో ఉన్నారు. హిందువులు, సిక్కుల కంటే ముస్లిం ఫోర్సే ఎక్కువ అవార్డులు, ర్యాంక్స్ సంపాదించారు. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఏయిర్ స్టాఫ్ కి డిప్యూటీ చీఫ్ గా ఇడ్రిస్ హసన్ లతీఫ్ ఉన్నారు. తర్వాత 1973 నుంచి 76 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ కి చీఫ్ గా సేవలందించారు.

టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం
టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లలో ముస్లింలు ఉన్నారు. సౌత్ ఏషియాలో టెర్రరిజంపై పోరాటాన్ని ప్రోత్సహించిన వాళ్లలో 36వ స్థానంలో జైమిత్ ఉలేమా ఈ హింద్ అనే ముస్లిం ఉన్నారు. సయ్యద్ అమీన్ మెయిన్ 44వ స్థానంలో ఉన్నారు.

దేశంలో ముస్లింలు
అస్సాం జనాభాలో 34 శాతం ముస్లింలు, లక్షద్వీప్ లో 96శాతం, వెస్ట్ బెంగాల్ లో 27 శాతం కేరళలాలో 26 శాతం ముస్లింలు ఉన్నారు.

ప్రపంచంలో ముస్లింలు
ముస్లింలు ఎక్కువగా ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే భారత్ మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియా, పాకిస్తాన్ ల తర్వాత మూడవ స్థానంలో భారత్ లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఎక్కువ మసీదులు
ఇండియాలో 3 లక్షల కంటే ఎక్కువ మసీదులున్నాయి. పాకిస్తాన్ ఇంతకు రెట్టింపు ఉన్నాయి. అరబ్ కంట్రీస్ లో 1418, బంగ్లాదేశ్ లో 6 వేల మసీదులున్నాయి.



Click it and Unblock the Notifications











