Latest Updates
-
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్!
ఇండియాను భయపెట్టిన అత్యంత భయంకరమైన సంఘటనలు
యాక్ట్ ఆఫ్ గాడ్..!! ఈ పదం గుర్తుందా ? వెంకటేష్, పవన్ కణ్యాన్ సినిమా గోపాలా గోపాలా సినిమాలో ఎక్కువగా వినిపించిన పదం. అంటే ప్రకృతివైపర్యాలను యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెబుతారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రకృతిలో జరిగే మార్పులు, వైపరిత్యాలు అనేక ప్రమాదాలు, నష్టాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి కొన్ని వస్తువులు, సంపద నాశనం అయితే.. కొంతమంది జీవితాలు కోల్పోతారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం పడుతుంది.
ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు
అయితే ఇండియాలో చోటుచేసుకున్న కొన్ని ప్రకృతి వైపరిత్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా టెర్రిబుల్ గా, మరిచిపోలేని చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అలాంటి భయంకరమైన విపత్తులు ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం..

బెంగాల్
1770లో బెంగాల్ లో వచ్చిన కరువు చాలా భయంకరమైనది. ఆ సమయంలో వచ్చిన కరువు చాలామందినే బలి తీసుకుంది. దీనికారణంగా దాదాపు కోటి మంది చనిపోయారు. అంటే ఆ రాష్ర్టంలోని జనాభాలో మూడో వంతు మంది కరువుకి బలయ్యారు.
మళ్లీ 1943లో బెంగాల్ లో వచ్చిన కరువు కూడా జనాభాకు తీరని నష్టం తీసుకొచ్చింది. అప్పుడు 40 లక్షణ మంది చనిపోయి ఉంటారు.
హావభావాల సమ్మేళనం భారతీయ నృత్యకళారీతులు

ఆంధ్రప్రదేశ్
1835లో యాక్ట్ ఆఫ్ గాడ్ ప్రభావం ఆంధ్రాపై కూడా ప్రభావం చూపింది. తూర్పు గోదావరి జిల్లాలో ఉండే కోరంగిలో సంభవించిన సైక్లోన్ ఆ గ్రామాన్ని తుడిచిపెట్టుకుని పోయేలా చేసింది. ఈ తుఫాను ధాటికి దాదాపు 3.2 లక్షల మంది చనిపోగా, 25 వేల షిప్ లు కొట్టుకుపోయాయి.

గుజరాత్
ఇండియాలో వచ్చిన అతి భయంకరమైన భూకంపం గుజరాత్ లో సంభవించింది. 2001లో వచ్చిన ఈ భూకంపం రిక్కర్ స్కేల్ పై 7.9 గా నమోదైంది. 2001 జనవరి 26న సంభవించిన ఈ భూకంపంలో 30 వేల మంది చనిపోయారు. అంతేకాదు చాలా గ్రామాలు నాశనమయ్యాయి.
విశ్వంలోనే నెం.1 శ్రీమంత దేవాలయం మన ఇండియాలో ఉంది!

ఇండియన్ ఓసియన్
ఇండియన్ ఓషియన్ లో సంభవించిన సునామీ మరింత భీకరమైనది. 2004లో సముద్రంలో వచ్చిన ఈ సునామీ రిక్టర్ స్కేల్ పై 9 గా చూపించింది. ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ లో కనీసం 10 వేల మంది చనిపోయి ఉంటారని, లక్షా 50 వేల మంది ఈ సునామీ బాధితులను భారతీయ రికార్డ్స్ చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్
2013లో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఈ వరదలు చాలా భయంకరమైనవి. అనేక పంటపొలాలు నాశనమయ్యాయి. అలాగే.. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిస్సయ్యారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల ఇండియాలో సంభవించిన భయంకరమైన ప్రకృతి విపత్తులు.



Click it and Unblock the Notifications