Just In
- 1 hr ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 3 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- 5 hrs ago Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- 6 hrs ago Today Raja Yoga: ఈరోజు రాజయోగం ఏర్పడింది: కన్యారాశితో సహా 5 రాశులకు ఆనందం, శ్రేయస్సు
హైదరాబాద్లో మసాజ్, స్పా సెంటర్లలో జోరుగా సెక్స్, యూత్ కు కిక్ ఎక్కిస్తున్నారు
హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ భలే ఇష్టం. మనకే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల వారికి కూడా హైదరాబాద్ అంటే పిచ్చి. హైదరాబాద్ స్పా సెంటర్, హైదరాబాద్లో మసాజ్
హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ భలే ఇష్టం. మనకే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల వారికి కూడా హైదరాబాద్ అంటే పిచ్చి. అక్కడున్న మహాత్యం అలాంటిది మరి. హైదరాబాద్ కు వెళ్తే ఎలా అయినా బతికేయొచ్చు అనే కాన్ఫిడెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ చాలా మారిపోయింది... మారిపోతూ ఉంది. ఇటీవల వెలుగుచూసిన కొన్ని సంఘటనలే అందుకు నిదర్శనం. తాజాగా హైదరాబాద్ అంతా గలీజ్ గా మారింది. దానికి కారణం గల్లీ గల్లీకో స్పా సెంటర్ వెలవడమే.
స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు
హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. తేలికా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు నిర్వాహకులు ఇలా చేస్తున్నారు. తాజాగా ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. మసాజ్, స్పా పేర్లతో గుట్టచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో శేరిలింగంపల్లిలోని స్పా సెంటర్లలో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తాజాగా తనిఖీలు చేపట్టారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న నలుగురు విటులు, యువతులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.
అందమైన యువతులను రప్పిస్తున్నారు
బాడీ మసాజ్ పేరుతో ఏర్పాటు చేసిన స్పా సెంటర్కు వచ్చే కస్టమర్లకు యువతులను ఎర వేస్తున్నారు నిర్వాహకులు. థాయ్లాండ్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్, టాంజానియా, నార్త్ ఇండియా, హైదరాబాద్ తో పాటు గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి అందమైన యువతులను ఇక్కడికి రప్పిస్తున్నారు. ఉన్నత వర్గాలకు చెందినవారి పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు రాజకీయ నేతల పుత్రరత్నాలు ఇందులో వున్నట్లు తెలుస్తోంది.
వ్యభిచారం చేస్తున్న వారు అరెస్టు
అలాగే మాయత్నగర్లోని అవురా తాయి మసాజ్ కేం ద్రంపై నారాయణగూడ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. జూన్ 21న రాత్రి కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఇక చందానగర్లోని సన్షైన్ స్పా అండ్ బ్యూటీ కేర్లో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులను అరెస్టు చేశారు. నలుగురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు.
సెక్స్ వ్యాపారం
ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల చాలా స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు సెక్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. యువతను టార్గెట్ చేసి వారి నుంచి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అసలు కథ ఏమిటో మీరూ చదవండి.
వ్యభిచార కార్యకలాపాలు
కొందరు వ్యాపారులు అధునాతనమైన భవనాల్లో మసాజ్, స్పా సెంటర్లను ఏర్పాటు చేసి బాడీ మసాజ్ పేరుతో సంపన్న వర్గాలకు చెందిన వారిని ఆకర్షించడంతో పాటు వ్యభిచార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొందరు థాయ్లాండ్, మకావు లాంటి దేశాలకు వెళ్తున్నారు. ఆయా దేశాల్లో ఇలాంటి వ్యాపారాలు చట్టబద్ధం కావడంతో అక్కడ నిర్వహించే మసాజ్ను నేర్చుకుంటున్నారు.
సెక్స్ లో పాల్గొనే అమ్మాయిలకు
ఆ తర్వాత అక్కడి అందమైన యువతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానమి చెప్పి ఆకర్షిస్తున్నారు. వారిని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. తర్వాత నగరంలో స్పా, మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. అలా మసాజ్ చేస్తూ సెక్స్ లో పాల్గొనే అమ్మాయిలకు పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లిస్తున్నారు.
డ్రగ్స్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలతో కిక్
స్పా, మసాజ్ సెంటర్లకు కస్టమర్లు వచ్చేలా అందమైన యువతులతోనే ఎర వేయిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, నారాయణగూడ, హిమాయత్నగర్ వంటి సంపన్న ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లకు కొందరు నిర్వాహకులు డ్రగ్స్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. సెక్స్ తో పాటు అలాంటి కిక్ కూడా ఇస్తుండడంతో యూత్ ఎక్కువగా స్పా, మసాజ్ సెంటర్లపై మొగ్గు చూపుతుందట.
సివిల్స్ ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి
ఇదిలా ఉండగా 2016లో సివిల్స్ రాసిన సంతోష్ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసి ర్యాంకు సాధించాడు. అయితే నారాయణగూడలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ వేసిన యూపీఎస్సీ సంతోష్ పేరును విత్హెల్డ్లో పెట్టింది. మరోపక్క ఆ సెలూన్ను సంతోష్ బంధువైన రాధారెడ్డి స్పాగా మార్చారు.
మగవారికి ఆడవారితో మసాజ్
మగవారికి ఆడవారితో మసాజ్లు చేయించడం (క్రాస్ మసాజ్) చట్ట విరుద్ధమైనప్పటికీ అలా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కారు. దీంతో స్పా బాధ్యతలు చేపట్టిన సంతోష్ క్రాస్ మసాజ్ల పరంపరను కొనసాగించాడు. అందమైన యువతుల్ని ఉద్యోగినులుగా నియమించుకున్నాడు. వీరితో కస్టమర్లకు మసాజ్లు చేయిస్తూ భారీగా వసూలు చేస్తున్నాడు. ఇక విచారణ నేపథ్యంలో తాను సివిల్స్ ర్యాంకర్ అని, కేసుతో ఎంపికకు బ్రేక్ పడిందని సంతోష్ చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు.
స్పా సెంటర్లలో ఎంజాయ్
ఇక ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కాలేజీ సెలవు రోజుల్లో కూడా పని ఉందంటూ బయటకు వెళ్లేవాడు. స్పా సెంటర్లలో ఎంజాయ్ చేసేవాడు. అనుమానం వచ్చిన తండ్రి ఓరోజు కొడుకుకు తెలియకుండా ఫాలో అయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే మణికొండలో ఓ మసాజ్ పార్లర్కు సందీప్ వెళ్లాడు.
తర్వాత బ్యాంక్ ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే రెండు నెలల్లోనే డెబిట్ కార్డు ద్వారా ఆ మసాజ్ పార్లర్కు 28 సార్లు రూ.2,500 చొప్పున రూ.70 వేలు చెల్లించినట్లు బయటపడింది. ఆయన వెంటనే పోలీసులకు విషయం చెబితే వెంటనే పార్లర్పై దాడి చేసి నిర్వాహకులతోపాటు చాలా మంది యువతులను అరెస్టు చేశారు.
రూ.40 కోట్ల మేర వ్యాపారం
ఇలా విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పంపుతున్న సొమ్మును మసాజ్ పార్లర్లకు ఖర్చు చేస్తున్నారు. మహిళలు మసాజ్ చేస్తారంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా విద్యాసంస్థల వద్ద ఏజెంట్లను పెట్టి మరీ కొన్ని సెంటర్లు ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్లో మొత్తం పార్లర్లు రోజుకు రూ.40 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా.
హైదరాబాద్ శివార్లలోని వందలాది విద్యాసంస్థల్లోని విద్యార్థులే వీరికి లక్ష్యం. బెంగాల్, మణిపూర్, అస్సాం, కేరళ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మసాజ్ పేరుతో ఆ పనులు చేయిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఇక హైదరాబాద్ లోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచామని మాదాపూర్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు తాజాగా తెలిపారు. లైసెన్స్ లేని మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నామని, క్రాస్ మసాజ్ లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.