Just In
- 3 min ago Surya Nakshatra Sanchara: ఉత్తరా నక్షత్రంలో సూర్య సంచారం - ఈ 3 రాశుల వారికి ధనలాభం...
- 1 hr ago ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- 2 hrs ago మీనరాశిలో బుధుడు: ఈ 3 రాశుల వారికి వ్యాపారంలో గొప్ప విజయం..ధనలాభం
- 6 hrs ago ఈరోజు ఉద్యోగంలో మనశ్శాంతి, జీవిత భాగస్వామి మాట వింటే డబ్బు విషయాల్లో ఇబ్బంది ఉండదు; మంగళవారం రాశిఫలాలు
మరణించేటప్పుడు 30 సెకన్ల ముందే చావు గురించి మీకు తెలిసిపోతుంది! మరణానికి ముందు సూచనలివే
కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం.. రెప్పపాటు కాలంలోదే జీవితం. ఎంత దుర్భరమైన బతుకు అయినా సరే.. వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మరణించేటప్పుడు 30 సెకన్ల ముందే చావు గురించి
కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం.. రెప్పపాటు కాలంలోదే జీవితం. ఎంత దుర్భరమైన బతుకు అయినా సరే.. వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ఎవ్వరు చావునుంచి బయట పడలేరు.
అయితే ఒక ప్రముఖ శాస్త్రవేత్త తాను చనిపోవడానికి 30 సెకన్ల ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నాడు. తాను అనుకున్నట్లుగానే మరణానికి 30 సెకన్ల ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగాడంట.
చావుకు ముందు
నరాల నిపుణుడు అయిన డాక్టర్ కామెరాన్ షా ఇలా చావు ముందు మనిషిలో జరగబోయే కొన్ని పరిణామాలను గమనించాడట. ఒక మహిళ బ్రెయిన్ పై ఆయన చేసిన పరిశోధన వల్ల కొన్ని నిజాలు వెలుగుచూశాయట.
మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుందట
మెదడు రక్తం శరీరంలో కింద భాగం నుంచి సరఫరా అవుతుంది. ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో దానికి కంటే కొంత సమయానికి ముందే మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుందట. దీంతో మన శరీరంలో మెదడుకు ముందే మన చావుకు సంబంధించి తెలిసిపోతుంది.
తాను చనిపోతున్నాను అనే విషయం
అలా చనిపోయే ముందు 10 నుంచి 20 సెకన్ల మధ్య ఇక తాను చనిపోతున్నాను అనే విషయం క్లియర్ గా మనిషికి అర్థం అయిపోతుందట. డాక్టర్ కామెరాన్ చాలా మందిపై ప్రయోగాలు చేసి ఈ విషయాలు తెలుసుకున్నాడట. మీరు మెదడుకు రక్త సరఫరాను ఆగిపోతున్న విషయం స్పష్టంగా చనిపోయే ముందు అందరికీ అర్థం అవుతూ ఉందట. సైన్స్ ప్రకారం ఇలా ఉంటే కొన్ని పురాణాగాథల ప్రకారం మరణానికి ముందు సంకేతాలు మరోలా ఉన్నాయి.
శివ పురాణం ప్రకారం
శివ పురాణం ప్రకారం పార్వతి దేవి పరమేశ్వరుణ్ణి.. మరణానికి ముందు సూచన ఏంటి అని అడిగింది. ఒక వ్యక్తి మరణించే ముందు ఏమేం జరుగుతాయని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీ దేవి కి మరణం గురించి ఇలా చెప్పాడు.
6 నెలల్లో మరణిస్తాడని సూచనట
ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా కొద్దిగా ఎర్రగా మారినప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో మరణిస్తాడని సూచనట.ఒక వ్యక్తి నీళ్ళల్లో లేదా నూనె లో లేదా అద్దం లో వారి ప్రతిబింభం కనిపించకపోతే ఆ వ్యక్తి 6 నెలల్లో మరణిస్తాడని సూచనట. ఎవ్వరైతే చనిపోయే టైం కంటే ఒక నెల ఎక్కువ జీవిస్తారో వాళ్ళు వారి సొంత నీడను కూడా చూడలేరట. ఒకవేళ చూసినట్లయితే తల లేని నీడ మాత్రమే చూడగలరట.
నరాలు బిగుసుకొని ఉంటే
ఒక వ్యక్తి నాలుక అకస్మాతుగా ఉబ్బితే, ఇంకా దంతాల నుంచి చీము పడితే వాళ్ళు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం జీవించలేరట. ఒక వ్యక్తి ఎడమ చేయి వారం వరకు పట్టేస్తు ఉంటే లేదా నరాలు బిగుసుకొని ఉంటే ఆ వ్యక్తి ఒక నెల కంటే ఎక్కువ కాలం బతకడు. ఒక వ్యక్తి ప్రతిదీ నల్లగా చూడడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి చావు దగ్గరలోనే ఉందని అర్ధం.
ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే
ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని వెలుతురు చూడలేకపోతే ఆ వ్యక్తి ఆరు నెలలు మాత్రమే సజీవంగా ఉండగలడని సూచన. ఒక వ్యక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి జీవితం ఆరు నెలలు మాత్రమే ఉంటుందట. ఒక వ్యక్తి సూర్యుడు, చంద్రుడు, ఆకాశాన్ని చూసిన ప్రతి సారీ ఎర్రగా కనిపిస్తే అతడు కొద్ది రోజుల్లో చనిపోతాడని అర్ధం.
జీవన రేఖ
ఇక మన చేతిలోని జీవన రేఖ మనం ఎంతకాలం బతుకుతామో చెబుతుందట. ఎవ్వరికైనా వారి జీవన రేఖ కట్ చేసి ఉంటె వారు తక్కువ కాలం బతుకుతారట.మరణం ఒక రహస్యం లాంటిది. ధర్మ గ్రంధం ప్రకారం వ్యక్తి ఆత్మ.. ఆ మనిషి బతికి ఉండగా చేసిన ఖర్మలను బట్టి స్వర్గానికో నరకానికో వెళుతుంది.
అమృతుడనే వ్యక్తి
ఇక మరణానికి సంబంధించి మరో కథ కూడా వినపడుతూ ఉంటుంది. పురాణ కాలంలో యమునా నది వడ్డున అమృతుడనే వ్యక్తి నివసించేవాడు. ఒక సందర్భంలో అతనికి తానూ చనిపోతే ఎలా అనే ఆలోచన పట్టుకొని మృత్యువు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా చనిపోతానో అని రోజు తలచుకుంటూ బయపడేవాడు. దీంతో అతను ఈ మృత్యు భయం పోవాలంటే యమధర్మరాజు ప్రత్యేక్షం కోసం ఘోర తపస్సు చేస్తాడు, అలా చేయడం వలన యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడు.
చనిపోయే ముందు సూచనలు
వెంటనే యమధర్మరాజు ఏమి వరం కావాలో కోరుకో అని అడగ్గా అందుకు అమృతుడు తానూ ఎప్పుడు చనిపోతానో, నేను చనిపోయే ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలిసేలా చేయాలనీ కోరుతాడు. అలా సూచనలు ఇస్తే నా బాధ్యతలు అన్నింటిని అందరికి అప్పజెప్పేస్తా అని యమునికి చెప్తాడు.అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుంది అనేది సృష్టి రహస్యం అని దానిని తెలుపలేను అని కాకపొతే మరణం వచ్చే ముందు కొన్ని సూచనలు మాత్రం పంపుతానని వాటి ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో ఒక అంచనాకు రావొచ్చు అని యముడు అమృతుడికి వరం ఇచ్చి మాయం అవుతాడు.
యముడు చెప్పిన మాటలు మరచిపోతాడు
కొన్ని రోజుల తర్వాత అమృతుడు యముడు చెప్పిన మాటలు మరచిపోతాడు. అలా ఏళ్ళు గడిచిపోయినా తరువాత తనకు పెళ్లి అవడం,పిల్లలు పుట్టడం, సంసారం వృద్ధి చేసుకోవడంలో అలాగే తన పిల్లలు పెద్దవారై వారికి పెళ్లి చేయడంలో మునిగిపోతాడు. ఒకరోజు అమృతుడికి యముడితో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. కానీ తనకు యముడు నుండి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తనకు ఇంకా చాలా ఆయువు ఉందనుకొంటాడు.
వెంట్రుకలు తెల్లబడిపోతాయి
ఒక రోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోతాయి, చర్మం అంత ముడుతలుబడిపోతుంది. మరో రోజు తన పళ్లన్ని ఊడిపోతాయి అప్పుడు కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు.మరి కొంత కాలానికి తనకి కళ్లు కనిపించకుండా పోతాయి, చివరికి పక్షావాతం వచ్చి మంచాన పడుతాడు. ఈ రెండు సందర్భాలలో కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు.
నీ ఆయువు తీరింది
ఇక చివరికి ఒక రోజు యముడు వచ్చి నీ ఆయువు తీరింది అని అందుకే నీ ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అమృతుడితో చెబుతాడు. ఆ మాటలకూ ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు మరి చెప్పినట్టు చావు సూచనలు ఎలాంటివి రాలేదని, అయినా మీరు వచ్చి నా ప్రాణాలను తీసుకుపోతున్నారు మరి నాకు ఇచ్చిన వరం ఏమిటి అని అడుగుతాడు. దానితో యముడు నీ ఆయువు తీరింది నిన్ను తీసుకుపోవలసిందే అంటాడు.
4 సూచనలు పంపించాను
యముడు నీకు ఇచ్చిన వరం ప్రకారం 4 సూచనలు పంపించాను అని అవే 4 ఆనారోగ్యాలు అని( వెంట్రుకలు తెల్లబడటం, పళ్లు ఊడిపోవడం, చూపు కోల్పోవడం, పక్షవాతం రావడం) అని అమృతుడికి యమధర్మరాజు వివరిస్తాడు. దానితో నిజం తెలుసుకొని అమృతుడు యముని వెంట వెళ్ళిపోతాడు.
ఎంత ధనవంతుడైనా
దీనిని బట్టి మనకు తెలిసిన విషయం మన ఆరోగ్యమే మనకు రక్ష, ఆరోగ్యం చెడిపోయిందో ఇక మనకు చావే గతి తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే ఎంత ధనవంతుడైన, ఎంత పేదవాడు అయినా పుట్టుక చావు ఎవ్వరు ఆపలేరని తెలుసుకోవాలి. తికున్న రోజులు మనం చనిపోయిన బతికున్నవారి మనసులో ఎలా చిరంజీవిగా ఉండాలో తెలుసుకోవాలి. అనవసరంగా పక్కనోడ్ని కెలుకుతూ ఉండకండి. ఎప్పుడో ఒకసారి అందరం చచ్చిపోయేవాళ్లమే.