Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
Kanya Rasi Ugadi Rasi Phalalu 2022 'శుభకృత'ఏడాదిలో కన్య రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే..!
2022 'శుభకృత'నామ సంవత్సరంలో కన్య రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుదాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-11, వ్యయం-05
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం 2,3,4 నాలుగు పాదాలు లేదా హస్త నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, లేదా చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో అంటే మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటాయి.

రాజపూజ్యం-4, అవమానం-09
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం కన్నా అవమానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశిలో గురు సంచారం చేయడం వల్ల తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రవి, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాల సంచారం వల్ల విశేష ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఈ కాలంలో శుభకార్యాల్లో పాల్గొంటారు.

శని గ్రహ ప్రభావంతో..
ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే 2023 సంవత్సరంలో జనవరి 17 తర్వాత ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఆరోగ్య సమస్యల నుండి ఉపశమం లభిస్తుంది. మీరు శత్రువులపై కూడా విజయం సాధిస్తారు.

రాహు ప్రభావంతో..
రాహువు అష్టమ భాగంలో సంచారం చేయడం వల్ల
తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి కొన్ని ఆసక్తికర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే అత్యాశ కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది.మరోవైపు ఈ సంవత్సరంలో పాము, తేలు వంటి వాటి వల్ల కొన్ని ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు జూదం ఆడే అలవాటు ఉంటే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

కేతు ప్రభావం వల్ల..
ఈ కాలంలో తులరాశిలో కేతువు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. మీ బంధుమిత్రులతో ఆర్థిక పరమైన విషయాల్లో విభేదాలు రావొచ్చు. వ్యాపారులు తరచుగా నష్టపోయే అవకాశం వస్తుంది. ఇదంతా ఇతరులపై ఆధారపడటం వల్లే జరగొచ్చు.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం పొందేందుకు నిరంతరం వినాయకుని ఆరాధన చేయాలి. మరకత గణపతికి లేదా శ్వేతార్చన గణపతికి లేదా చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభు వినాయక దేవాలయానికి వెళ్లి దర్శించుకోవడం వల్ల మీరు కేతు ప్రభావాల నుండి బయటపడొచ్చు. రాహువు అనుగ్రహం పొందడానికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయాలి. అలా కుదరని వారు దగ్గర్లోని అమ్మవారి ఆలయానికి వెళ్లి నిత్యం కుంకుమ పూజలు చేయాలి.ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications