Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
అయోధ్యలో సైకిల్ మెకానిక్ చాచాకు సన్మానం.... ఎందుకంటే...
ఈ సంవత్సరం ఈ అవార్డు పొందిన వారిలో ఒక సామాన్య వ్యక్తి ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో అతనిని ‘షరీఫ్ చాచా‘ అని ప్రేమగా పిలుస్తుంటారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని కొందరు ప్రముఖులకు.. వారు చేసిన సేవలకు గుర్తుగా వారికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. అయితే ప్రతి సంవత్సరం ఎందరో ప్రముఖులు.. వారిలో కొందరికి అవార్డులు రావడం అనేది అత్యంత సహజం. కానీ ఈ సంవత్సరం ఈ అవార్డు పొందిన వారిలో ఒక సామాన్య వ్యక్తి ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో అతనిని 'షరీఫ్ చాచా' అని ప్రేమగా పిలుస్తుంటారు. ఇంతకీ ఈయనకు ఎందుకు పద్మశ్రీ అవార్డు వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఫేమస్ అయిన షరీఫ్ చాచా..
అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తెలియని మృతదేహాలను దహనం చేసిన ఆయన అక్కడ బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈయన పేరు రావడంతో ఈయన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.
ఇప్పటివరకు ఆయన 25 వేల మృతదేహాలను ఖననం/దహనం చేశారు. ఈ 25 వేల మృతదేహాలలో హిందూ మరియు ముస్లిం మృతదేహాలు రెండూ ఉన్నాయి.

షరీఫ్ చాచా వ్యక్తిగతంగా ఓ సైకిల్ మెకానిక్. ఈయన ప్రతిరోజూ స్మశానవాటికను సందర్శిస్తాడు. 1992లో ఈయన కుమారుడు సుల్తాన్ పురంలో చనిపోయాడు. దీని తర్వాతే అతనికి తెలిసింది. ఆ సమయంలో రామ జన్మ భూమి వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చి వేయబడింది. ఆ తర్వాత తన కుమారుడి సంఘటన గురించి తెలుసుకున్న ఆయన అప్పటి మృతదేహాల అంత్యక్రియలకు బాధ్యత వహించడం మొదలుపెట్టాడు. ఏ శవం కూడా రోడ్డుపై కుళ్లిపోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడట. అప్పటి నుండి ఇంత గొప్ప పనిని నిరంతరం చేస్తున్నారు. దీని వల్ల ఆయన చాలా సార్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన ఏ మాత్రం అధైర్యపడలేదు. విరాళాల ద్వారా నిధులు సేకరించడం మొదలు పెట్టారు. అలా తన పనిని నిరంతరాయంగా కొనసాగించినట్లు... కొనసాగిస్తున్నానని షరీఫ్ చెప్పారు.
ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి.. ఇది వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ షరీఫ్ చాచాకు ప్రశంసలు అందుతున్నాయి. ఈరోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే తమదైన శైలిలో స్పందిస్తున్నారు.



Click it and Unblock the Notifications











