Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
మావోయిస్టు ప్రాంతం నుంచి తొలి మహిళా పైలట్..
ఏడు సంవత్సరాల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రయివేట్ విమానయాన సంస్థలో కో పైలట్ గా అనుప్రియ ఛాన్స్ కొట్టేసింది.
ఇండియన్ ఏవియేషన్ లో పైలట్ గా కొలువు సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో కఠిన సవాళ్లను, అనేక పరీక్షలను ఎదుర్కోవాలి. అన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే పైలట్ గా మనకు కొలువు ఖాయమవుతుంది. అంత కఠినమైన సవాళ్లను, అనేక టెస్టులను అవలీలగా అధిగమించింది ఆదివాసి మహిళ. కేవలం 23 ఏళ్లకే కమర్షియల్ పైలట్ గా కొలువు కొట్టేసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరో తెలుసా ఆమె పేరేంటో తెలుసా.. ఆమెనే ఆదివాసి అనుప్రియ లక్రా.
ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాంతమైన మల్కాన్ గిరి జిల్లాకు చెందిన అనుప్రియ చిన్ననాటి నుండి కన్న కలలను అత్యంత వేగంగా నిజం చేసుకుంది. కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి గిరిపుత్రికగా రికార్డు సృష్టించింది. ఆమె తండ్రి మరినియాస్ లక్రా పోలీస్ డిపార్ట్ మెంటులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మల్కాన్ గిరిలో ని దీప్తి కాన్వెంట్ స్కూల్లో ఏడో తరగతి వరకు చదివించాడు. తర్వాత జీవన్ జ్యోతి స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసేందుకు సెమిలిగుడకు వెళ్లారు. అక్కడ నుండి సుందర్ ఘర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండే పైలట్ కావాలన్న ఆమె కోరికను నెరవేర్చుకునేందుకు 2012 సంవత్సరంలో తన ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసింది.
అంతే అప్పటి నుండి సీరియస్ గా పైలట్ ప్రవేశపరీక్ష కోసం సన్నద్ధమైంది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వర్ పైలట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. ఏడు సంవత్సరాల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రయివేట్ విమానయాన సంస్థలో కో పైలట్ గా ఛాన్స్ కొట్టేసింది. ఒడిశా రాష్ట్రం నుండి తొలి మహిళా పైలట్ గా ఎంపికై రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా అనుప్రియ తల్లి జిమాజ్ జాస్మిన్ మాట్లాడుతూ ''కుటుంబం బంధువుల సహకారంతో, ఆమె ఉన్నత చదువుల కోసం భువనేశ్వర్ కు మకాం మార్చాం. విమానయన రంగంలో చేరేందుకు నన్ను అనుమతి కోరింది. నా సోదరులు (ఆమె మేనమామలు) ఇందుకు చాలా సహాయం చేశారు. వారు మాకు మద్దతు ఇచ్చారు. చివరికి నా కూతురు తానెంటో నిరూపించుకుంది. దీంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది'' అని ఆమె అన్నారు.
అనంతరం అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా మాట్లాడుతూ '' ఈ క్రెడిట్ అంతా నా భార్యకే దక్కుతుంది. అనుప్రియకు పైలట్ గా శిక్షణ ఇవ్వడాన్ని ఆమె ఒక సవాలుగా తీసుకుంది. ఈ విషయంలో నేను ఎప్పుడూ పెద్దగా బాధపడలేదు. నేను నా జీతం నా భార్యకు అప్పగించేవాడిని. ఆమెనే మొత్తం చూసుకునేది'' అని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications
