విస్తరి లేకుండా రాళ్లపై భోజనాలు, వర్షాల రాక కోసం ఊరు ఊరంతా వింత ఆచారం

భారతదేశంలో ఎన్నో వింత ఆచారాలు పాటిస్తుంటారు. కొత్తగా చూసే వాళ్లకు వింతగా, విచిత్రంగా అనిపించవచ్చు కానీ పాటించే వారికి ఏమీ అనిపించదు. అలాంటి ఆచారాలు భారత్ లో చాలానే పాటిస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసిందే. ఒకటీ రెండు రోజులు వాన దేవుడు కరుణించి మళ్లీ పత్తా లేకుండా పోయాడు.

వర్షాకాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. వరుణ దేవుడి కరుణ కోసం, వర్షాల రాక కోసం దేశవ్యాప్తంగా వివిధ రకాల ఆచారాలు, పూజాది కార్యక్రమాలు పాటిస్తుంటారు. కప్ప పెళ్లిళ్లు, జల యజ్ఞాలు లాంటివి చేస్తుంటారు. వరుణ యాగాలు, పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తుంటారు.

Weird Traditions Chittoor Beggilapalle People Perform Age Old Rituals For Rains On Chinna Mallappa Konda

వరుణ దేవుడి కురణ కోసం వింత ఆచారాం:

కానీ కొన్ని ప్రాంతాల్లో వానల కోసం వింత ఆచారాలు పాటిస్తుంటారు. భిన్నమైన పద్ధతుల్లో సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి ఓ వింత ఆచారాన్ని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల వాసులు వరుణుడు దయ చూపడానికి ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. ఊరు ఊరంతా కలిసి ఈ సాంప్రదాయాన్ని పాటించడం విశేషం. తమ పంటలు పండేందుకు, దాహార్తిని తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురవాలని వాన దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇదంతా చేస్తారు.

500 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం:

500 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మానవ నాగరికతలో అలవాట్లు ఆచారాలుగా మారతాయి. ఆచారాలు సంప్రదాయాలుగా మారతాయి. ప్రతి ఒక్కరూ తమ దైవాన్ని ఆరాధించేందుకు, దైవాన్ని కోరికలు కోరేందుకు బిన్నమైన పద్ధతులు పాటిస్తుంటారు. ఎవరి దారి వారిది. ఎవరి పద్ధతి వారిది. అలా వానలు కురవడానికి కుప్పలకు పెళ్లిళ్లు ఎలా చేస్తారో.. ఇక్కడ చిత్తూరులో కూడా ఇక్కడి స్థానికులు ఈ ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.

విస్తరి లేకుండా రాయిపైనే భోజనం:

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం బెగ్గిలపల్లె పంచాయతీ ప్రజలు వర్షాలు కురవడం కోసం ఇలా ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది.. అంతా కలిసి చిన్న మల్లప్ప కొండపైకి చేరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సామూహిక వంటలు చేస్తారు. వంటవార్పు పూర్తయిన తర్వాత ఎవరికి వారు బండలపై కూర్చొని, కూర్చున్న చోట రాయిని శుభ్రం చేసుకుని విస్తరి లేకుండా రాయిపైనే అన్నం వడ్డించుకుని భోజనం చేస్తారు.

రాళ్లపై భోజనం - వరుణుడు కరుణిస్తాడంటున్న స్థానికులు:

ఈ ఆచారం 500 సంవత్సరాలకు పైగా ఆచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండపై రాళ్ల మధ్య సామూహికంగా వంటలు చేసుకుని విస్తరి లేకుండా భోజనం చేయడం వల్ల వాన దేవుడు కరుణిస్తాడని, ప్రసన్నమైన వానలు కురిపిస్తాడని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటారు. ఇలాంటి ఆచారం కేవలం చిత్తూరులోకే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఉంది. అక్కడ వర్షాలు కురవడం కోసం 'వరద పాశం' పేరుతో ఆచారాన్ని నిర్వహిస్తారు. ఊరంతా కలిసి గుట్టలపైకి వెళ్లి వంటావార్పు చేసుకుంటారు. అనంతరం అక్కడే విస్తరి లేకుండా భోజనం చేస్తారు.

Story first published: Wednesday, July 5, 2023, 16:30 [IST]
Desktop Bottom Promotion