Latest Updates
-
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
తల్లీ కూతుళ్లకు ఒకరే భర్త, బంగ్లాదేశ్ మండీ తెగలో విచిత్ర సాంప్రదాయం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందులో కొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. కొన్ని ఆచారాలు కనీసం ఊహకు కూడా అందకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది తెగలు ఇప్పటికీ పురాతన సాంప్రదాయాలను పాటిస్తుంటాయి. ఆయా ఆచార వ్యవహారాలు మనకు కొత్తే కావొచ్చు కానీ అక్కడి వారికి అది చాలా సాధారణం. అలాంటి ఓ వింతైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(Image: marieclaire)
బంగ్లాదేశ్, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే మండీ తెగలో ఓ విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అది వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. అక్కడ తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసి చేసుకుంటారు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా అక్కడి వారు ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
స్త్రీలే ఇంటికి పెద్దలు:
బంగ్లాదేశ్ లోని మారుమూల కొండ ప్రాంతాల్లో, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో మండీ తెగ వారు కనిపిస్తుంటారు. ఈ మండీ తెగలో స్త్రీలకే సర్వహక్కులు ఉంటాయి. వారే ఇంటి పెద్దలు. మండీ తెగ మాతృస్వామ్య సమాజం. ఆస్తులు కూడా తల్లి నుంచి కూతుళ్లకు బదిలీ అవుతాయి. ఇంట్లోని అన్ని ప్రధాన నిర్ణయాలు స్త్రీలే తీసుకుంటారు. అలాగే ఓ విచిత్రమైన సాంప్రదాయాన్ని కూడా వాళ్లు ఇప్పటికీ పాటిస్తున్నారు. అదే జాయింట్ మ్యారేజ్. ఇది కుటుంబాన్ని, కుటుంబ ఆస్తిని రక్షించేందు కోసం తీసుకువచ్చిన ఓ సాంప్రదాయం. దీని ప్రకారం తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసే చేసుకుంటారు.
జాయింట్ మ్యారేజ్:
మండీ తెగలోని స్త్రీలు ఒకవేళ తమ భర్తలను కోల్పోతే.. కుటుంబ పోషణకు, ఇతర అవసరాలకు మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఇతరుల పాలవ్వకుండా ఉండేందుకు ఇతర వ్యక్తులను పెళ్లి చేసుకోరు. అందుకోసమే ఈ జాయింట్ మ్యారేజ్ ఆచారాన్ని తీసుకువచ్చారు. ఈ ఆచారం ప్రకారం.. వితంతువు అయిన మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే.. తన కూతురితో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా ఒకే వ్యక్తిని తల్లీ కూతుళ్లు వివాహం చేసుకుంటారు. ఈ ఆచారం వల్ల ఆస్తి తమ వంశంలోనే ఉండటంతో పాటు పిల్లలను కనడానికి భర్త కూడా ఉంటాడు.
తగ్గిపోతున్న జాయింట్ మ్యారేజెస్:
ఇతర సంస్కృతుల ప్రభావం వల్ల, మహిళలకు చదువు అందుతుండటం వల్ల తెగ ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. జాయింట్ మ్యారేజీలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటీ మండీ తెగలో తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడటం అనే ఆచారం ఉందని అంగీకరిస్తున్నారు.



Click it and Unblock the Notifications