Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
తల్లీ కూతుళ్లకు ఒకరే భర్త, బంగ్లాదేశ్ మండీ తెగలో విచిత్ర సాంప్రదాయం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందులో కొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. కొన్ని ఆచారాలు కనీసం ఊహకు కూడా అందకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది తెగలు ఇప్పటికీ పురాతన సాంప్రదాయాలను పాటిస్తుంటాయి. ఆయా ఆచార వ్యవహారాలు మనకు కొత్తే కావొచ్చు కానీ అక్కడి వారికి అది చాలా సాధారణం. అలాంటి ఓ వింతైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(Image: marieclaire)
బంగ్లాదేశ్, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే మండీ తెగలో ఓ విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అది వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. అక్కడ తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసి చేసుకుంటారు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా అక్కడి వారు ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
స్త్రీలే ఇంటికి పెద్దలు:
బంగ్లాదేశ్ లోని మారుమూల కొండ ప్రాంతాల్లో, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో మండీ తెగ వారు కనిపిస్తుంటారు. ఈ మండీ తెగలో స్త్రీలకే సర్వహక్కులు ఉంటాయి. వారే ఇంటి పెద్దలు. మండీ తెగ మాతృస్వామ్య సమాజం. ఆస్తులు కూడా తల్లి నుంచి కూతుళ్లకు బదిలీ అవుతాయి. ఇంట్లోని అన్ని ప్రధాన నిర్ణయాలు స్త్రీలే తీసుకుంటారు. అలాగే ఓ విచిత్రమైన సాంప్రదాయాన్ని కూడా వాళ్లు ఇప్పటికీ పాటిస్తున్నారు. అదే జాయింట్ మ్యారేజ్. ఇది కుటుంబాన్ని, కుటుంబ ఆస్తిని రక్షించేందు కోసం తీసుకువచ్చిన ఓ సాంప్రదాయం. దీని ప్రకారం తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసే చేసుకుంటారు.
జాయింట్ మ్యారేజ్:
మండీ తెగలోని స్త్రీలు ఒకవేళ తమ భర్తలను కోల్పోతే.. కుటుంబ పోషణకు, ఇతర అవసరాలకు మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఇతరుల పాలవ్వకుండా ఉండేందుకు ఇతర వ్యక్తులను పెళ్లి చేసుకోరు. అందుకోసమే ఈ జాయింట్ మ్యారేజ్ ఆచారాన్ని తీసుకువచ్చారు. ఈ ఆచారం ప్రకారం.. వితంతువు అయిన మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే.. తన కూతురితో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా ఒకే వ్యక్తిని తల్లీ కూతుళ్లు వివాహం చేసుకుంటారు. ఈ ఆచారం వల్ల ఆస్తి తమ వంశంలోనే ఉండటంతో పాటు పిల్లలను కనడానికి భర్త కూడా ఉంటాడు.
తగ్గిపోతున్న జాయింట్ మ్యారేజెస్:
ఇతర సంస్కృతుల ప్రభావం వల్ల, మహిళలకు చదువు అందుతుండటం వల్ల తెగ ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. జాయింట్ మ్యారేజీలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటీ మండీ తెగలో తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడటం అనే ఆచారం ఉందని అంగీకరిస్తున్నారు.



Click it and Unblock the Notifications