దోమలు ఇష్టపడే లే....లేత రక్తం!

By B N Sharma

Kids under 2 most vulnerable to malaria!
పిల్లలు రెండేళ్ళ లోపయితే దోమ కుట్టకుండా జాగ్రత్త వహించాలి. మలేరియా దోమ సాధారణంగా రెండేళ్ళలోపు పిల్లలని కుడితే వారిలోని రోగ నిరోధక శక్తి తక్కువవటంతో మలేరియా త్వరగా వచ్చేస్తుందట. మనుషులు మలేరియా బారిన పడకుండా ఏం చేయాలనే అంశంపై తాజాగా ఒక రీసెర్చి టెక్నాలజీ ఈ విషయాలను కనిపెట్టింది.

మలేరియా బారిన పడకుండా వుండాలంటే అనే అంశంపై రీసెర్చి చేస్తున్నారు. ప్రొటీన్ మైక్రో ఎర్రే టెక్నాలజీలో వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డా. అలీస్సా బార్రే, దోమ కరిచినా మలేరియా రాని ప్రొటీన్లను కనుగొంటున్నారు. మలేరియాను అరికట్టే ప్రొటీన్లలో ఒకటైన 'పిఎఫ్ ఇఎంపి1' ఈ వ్యాధి నిరోధకతకు అవసరమని తెలిపారు.

డా. బేరీ ఆమె సహచరులు మలేరియా అధికంగా వున్న ప్రదేశాలలో పరిశోధన చేస్తున్నారు. మలేరియా కలిగించే దోమలు రెండు సంవత్సరాలలోపే వున్న పిల్లలను కుడితే మలేరియా త్వరగా వస్తోందని కనుగొన్నారు. మనుషులు పెద్దవారయ్యే కొద్ది వారిలోని రోగనిరోధక వ్యవస్ధ బలపడి ఈ దోమ కాటుకు ప్రభావం తగ్గిపోతుందని, మరింత పెద్దవారైతే అసలు దోమ కరిచినా ఇన్ ఫెక్షన్ కలుగుతుందే కాని మలేరియా రాదని తెలిపారు. తాము చేసే పరిశోధన మలేరియా రోగ పరీక్షలకు కొత్త కోణం ఏర్పరుస్తుందని మలేరియా వ్యాక్సిన్ కు తోడుగా ఏ రకం ప్రొటీన్లు అందించాలనేది తెలుపుతుందని ఆమె తెలిపారు. ఈ పరిశోధన మాలిక్యులర్ అండ్ సెల్యులర్ ప్రొటియోమిక్స్ అనే జర్నల్ లో ప్రచురించారు.

Story first published: Wednesday, November 2, 2011, 15:26 [IST]
Desktop Bottom Promotion