ప్రసవించిన మహిళలకు శారీరక విశ్రాంతి!

By B N Sharma

Postnatal Massage Techniques
కొత్తగా తల్లి అయిన మహిళలకు తీవ్ర అలసట ఉంటుంది. మరోమారు ఆమె శారీరక సౌష్టవం పొందాల్సిన అవసరం వుంది. దానితోబాటు తన బేబీని, కుటుంబాన్ని సంరక్షించాల్సన అవసరం కూడా వుంది. నేటి రోజుల్లో మహిళలు గతంలో వలే దీర్ఘకాలం కాన్పఅనంతర విశ్రాంతి తీసుకునే స్ధితిలో లేరు. కనుక కాన్పు సమయంలో ఆమె పడిన శరీర వేదను తగ్గించాలంటే ప్రసవానంతర శారీరక మర్దనం అత్యవసరం. దీనికిగాను వృత్తి నిపుణులను ఎంపిక చేయాలి.

ఆచరించాల్సిన టెక్నిక్ లు:
1. జాము మాసేజ్ : ఈ పద్ధతిని ఇండోనేషియా లో ఆచరిస్తారు. పొట్ట కండరాలు బలపడతాయి. ప్రతి మాసేజ్ తోను కాన్పు సమయంలో సాగిన పొట్ట పలచబడిపోతుంది.

2. స్వీడిష్ మాసేజ్ : ఇది సరి అయినదిగా చెప్పవచ్చు.ఇందులో శరీరంలోని కండరాలన్ని మరోమారు యధా స్ధితికి వచ్చే మర్దనలు వుంటాయి. బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. నరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి.

3. ఫుట్ రెఫ్లక్సాలజీ: మన శరీరంలోని భాగాలన్నీ అరికాళ్ళలోని కొన్ని ప్రదేశాలకు కలుపబడివుంటాయి. వీటికి మాసేజ్ చేసి శరీరానికి పటుత్వం తెప్పిస్తారు.

4. ఆక్యుప్రెజర్: ఇది షియట్సు టెక్నిక్ లో ఒకభాగం. దీనితో కూడా ప్రసవానంతర నొప్పులను తగ్గించవచ్చు.

5. హెర్బల్ బాత్: వివిధ రకాల వనమూలికలు, వేళ్ళు, మసాల దినుసులవంటి వాటితో స్నానాలు చేయించి ఊరట కలిగిస్తారు.

ప్రసవానంతర మర్దనలు, ప్రసవం జరిగిన 4 లేదా 5 రోజుల్లో, సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవటం వంటి కేసుల్లో, మీకు అసౌకర్యమనిపించినపుడు చేయించుకోవచ్చు.

అయితే, చేసిన మాసేజ్ మిమ్మల్ని అలసట కలిగిస్తే నిలిపివేయండి. వరుసగా ప్రతి రోజూ చేయాల్సిన పనిలేదు. అన్నిటికి మించి సంక్షేమం కొరకు మీపైనా, బిడ్డపైనా తీసుకునే జాగ్రత్తలు.

Story first published: Tuesday, August 23, 2011, 12:06 [IST]
Desktop Bottom Promotion