ఆలస్యంగా గర్భం ధరిస్తేవచ్చే పాల సమస్య....!

By B N Sharma

 Breast Milk for A Baby!
వయస్సు పెరిగిన తర్వాత ప్రసవించిన స్ర్తీలల్లో పాలు ఉత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కాన్పు జరిగే వారిలో ఈ సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా గర్భం ధరించడం మంచిది. పిల్లలకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్‌ పడకూడదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమంగా పాలివ్వగల్గుతుంది. కొందరు స్ర్తీలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. బిపి, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుంది.అటువంటపుడు వారిలోని సమస్యలను తొలగించాలి.

పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షియం, ఇతర మందులను అందజేస్తారు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారంతో పాటు పాలు, పండ్లు, ఆకు కూరలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది. బిడ్డకు తగిన మోతాదులోనే పాలు పట్టాలి.

స్తనాలలో ఇన్‌ఫెక్షన్‌, గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కోవాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించాలి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.

తీవ్రమైన గుండె వ్యాధులతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్‌ తో సైకో గా మారిన వారు సైతం తమ పిల్లలకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం అవసరం. తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మహిళలు తమకుగల అపోహలు వదలి, బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.

Story first published: Wednesday, April 18, 2012, 14:47 [IST]
Desktop Bottom Promotion