పాలు పట్టే దశలో తల్లికి అనారోగ్యం కలిగితే?

By B N Sharma

Postnatal Healthcare For A Woman!
మహిళ తన స్తనాలలో ఇన్‌ఫెక్షన్‌, గడ్డలు ఉన్నప్పుడు బిడ్డకు సరిగా పాలు ఇవ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కోవాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు బిగదీసి పాలు తాగడంలో సమస్యలు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించాలి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు చేరే అవకాశం వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తల్లి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.

తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్‌ తో మనోవేదనకు గురైన వారు కూడా తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటువంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం. తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమనేది ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.కనుక మహిళలు అనవసరమైన అపోహలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. మహిళ కూడా అనేక కాన్పు తదనంతర ఆరోగ్య సమస్యలనుండి నివారించబడుతుంది.

శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు పాలు పట్టడంపై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు, ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా మంచిది.

బిడ్డను తొమ్మిది నెలలు మోసి తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి బిడ్డకు జన్మనిస్తుంది. తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. ఇక ఆపై శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావడం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది. కనుక మహిళలు దీనిని గుర్తించి, తాము జన్మనిచ్చిన పిల్లల ఆరోగ్య రీత్యా, తమ ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా పుట్టిన వెంటనే బిడ్డకు పాలు పట్టడం మొదలుపెట్టాలి.

Story first published: Wednesday, April 4, 2012, 16:30 [IST]
Desktop Bottom Promotion