గర్భవతులకు చేసే ఎన్‌ఐపీటీ టెస్ట్ అంటే ఏంటి..?

గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో ఎన్నో మెడికల్ పరీక్షలను చేస్తారు. గర్భధారణ నుంచి ప్రెగ్నెన్సీ వరకు అటు బిడ్డకు ఇటు తల్లికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి సమస్యలుంటే ముందుగానే పరిష్కరించడానికి వైద్యులు తల్లికి కొన్ని డయగ్నాస్టిక్ టెస్టులను చేయిచుకోమంటారు. వీటిలో ఎన్‌ఐపీటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎన్‌ఐపీటీ అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనాటల్ టెస్ట్.

What is NIPT test in pregnancy why it is done for pregnant mothers during prenatal stage

ఎన్‌ఐపీటీ పరీక్షను ఎప్పుడు, ఎందుకు చేస్తారు..?

గర్భిణీలకు మొదటి త్రైమాసికంలో డబుల్ మార్కర్ అనే రక్తపరీక్షను చేస్తారు. ఇది గర్భసంచి, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్ష. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్‌లో రిస్క్ ఫ్యాక్టర్‌లు ఉంటాయ్. లో రిస్క్, ఇంటర్మీడియటరీ రిస్క్, మాడరేట్ రిస్క్, హైరిస్క్ ఉంటాయ్. ఇంటర్మీడియటరీ రిస్క్ ఉన్నా సరే వైద్యులు ఎన్‌ఐపీటీ పరీక్షను చేయించుకోమంటారు. తల్లికి నుంచి బిడ్డకు ఏవైనా జన్యుపరమైన సమస్యలు వెళ్తున్నాయా లేదా అని విషయాలను ఈ ఎన్‌ఐపీటీ ద్వారా వైద్యులు తెలుసుకుంటారు.

బిడ్డ క్రోమోజోములు

గర్భిణీలందరూ ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్‌ను ఖచ్చితంగా చేసుకోవాలని నియమం లేదు. కాని వైద్యులు కొంతమందికి మాత్రమే ఈ టెస్ట్‌ను చేయించుకోమంటారు. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్‌ చేస్తారు. తల్లికి 30 ఏళ్లకు మించి ఉంటే బిడ్డకు క్రోమోజోముల సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఇతర జన్యుపరమైన లోపాలు బిడ్డకు ఉండే అవకాశముంది. బిడ్డకు అలాంటి జన్యుపరమైన లోపాలను తెలుసుకోవడానికి గర్భిణీలకు ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్ చేస్తారు.

కడుపులో ఉండే బిడ్డ డీఎన్‌ఏ తల్లి రక్తంలో కలుస్తుంది. తల్లి రక్తపరీక్ష ద్వారా బిడ్డ డీఎన్‌ఏను స్టడీ చేసే అవకాశముంది. ఈ పరీక్షను 10వ వారం నుంచి 25వ వారం వరకు చేసుకోవచ్చు. ఈ ఎన్‌ఐపీటీ పరీక్ష వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యానికి సంబంధించిన మూడు సిండ్రోమ్‌ల గురించి తెలుసుకోగలుగుతాం. మొదటిది డైన్ సిండ్రోమ్, రెండవది ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, ఇక మూడవది పాటవు సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్‌లో హైరిస్క్ ఉంటే బిడ్డకు జన్ముపరమైన సమస్య ఉందని ఓ అంచనాకు వస్తారు. ఈ సమస్య కుటుంబంలో ఎవరికైనా అంతకు ముందే ఉండవచ్చు లేదంటే పుట్టిన మొదటి బిడ్డకు ఉండవచ్చు.

ఎన్‌ఐపీటీ టెస్ట్‌లో ఏమి చేస్తారు

తల్లి చేతి నుంచి రక్త పరీక్ష కోసం రక్తాన్ని సేకరిస్తారు. గర్భసంచిలో ఉండే బిడ్డ రక్తకణాలు తల్లి రకంలో కలుస్తాయ్. ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్ ద్వారా బిడ్డ క్రోమోజోముల విశ్లేషణ ఆరోగ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పరీక్షలో అన్ని క్రమోజోములను ఒక్కో క్రోమోజోమును విశ్లేషించుకుంటూ వచ్చి సమస్య ఏదైనా ఉందానని తెలుసుకొని ఎన్‌ఐపీటీ రిపోర్ట్ ఇస్తారు.

ఎన్‌ఐపీటీ టెస్ట్ ధర ఎంత ఉంటుంది ?

ఆసుపత్రులను, డయగ్నాస్టిక్ సెంటర్లను బట్టి ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీ నాటల్ టెస్ట్ (ఎన్ఐపీటీ) ధర ఉంటుంది. కనీసం రూ.12,000 నుంచి రూ.16,000ల వరకు ఈ ఎన్ఐపీటీ పరీక్ష ఉంటుంది. ఇది కొంచం ఖరీదైన టెస్ట్‌గా చెప్పుకోవచ్చు. రిపోర్ట్ రావడానికి వారం సమయం పడుతుంది. పరీక్ష కోసం శరీరం నుంచి 10 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు.

Story first published: Friday, April 12, 2024, 14:31 [IST]
Desktop Bottom Promotion