Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
బంగాళదుంప కూరలోకి అదిరిపోయే పెసరపప్పు మసాలా పూరీ..ఎలా చేసుకోవాలంటే..
పూరీలంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. అయితే, ఎప్పుడూ ఒకేలాంటి గోధుమపిండి పూరీలు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి పెసరపప్పు మసాలా పూరీ ట్రై చేయండి. ఇది మామూలు పూరీలా చప్పగా కాకుండా, కాస్త స్పైసీగా, కరకరలాడుతూ అద్భుతమైన రుచిని ఇస్తుంది.
ముఖ్యంగా ఇందులో వాడే బొంబాయి రవ్వ (సూజీ) దీనికి ఎక్స్ ట్రా క్రిస్పీనెస్ అందిస్తుంది. దీన్ని తింటుంటే అచ్చం వేడివేడి కచోరీ తిన్న అనుభూతి కలుగుతుంది. పిల్లలకైతే ఇది బెస్ట్ ఫేవరెట్ స్నాక్ గా మారిపోతుంది. నోరూరించే పెసరపప్పు మసాలా పూరీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెసరపప్పు మసాలా పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
బొంబాయి రవ్వ - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - ఒక చిన్న ముక్క
పచ్చిమిర్చి - 2
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
పెసరపప్పు మసాలా పూరీ తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి.
-పప్పు బాగా నానిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి.
-రుబ్బుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కలుపుకోవాలి.
-ఆ తర్వాత పెసరపప్పు మిశ్రమంలో ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా, చేతితో నలిపిన కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర,రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ, సాధారణ పూరీ పిండిలాగా కాస్త గట్టిగా ముద్దలా పిసుకుతూ కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో గుండ్రంగా పూరీల్లా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉంటే బాగా పొంగుతాయి.
-స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెతో కడాయి పెట్టాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఒత్తి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
-పూరీలు చక్కగా పొంగి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే పెసరపప్పు మసాలా పూరీలు రెడీ. వీటిని వేడివేడిగా బంగాళదుంప కూరతో కానీ, టమాటా పచ్చడితో కానీ, కనీసం పెరుగుతో తిన్నా అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications