Latest Updates
-
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే! -
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే.. -
ఏం తిన్నా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోందా? అసలు కారణం ఫుడ్ కాదు.. -
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ! -
సాధారణ నొప్పులే కదా అని లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు కావచ్చు! -
భార్యతో రోజూ గొడవనా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే హ్యాపీగా ఉంటారు!
వేడి వేడి అన్నంలోకి మజ్జిగ పులుసు బోండా..కంచాలు కంచాలు లాగించేయడం గ్యారెంటీ!
కొన్ని వంటకాలు తింటుంటే.. ఎక్కడున్నా ఇంటి భోజనం గుర్తొస్తుంది, మనసు ఆనందంతో నిండిపోతుంది. అలాంటి ఓ అద్భుతమైన, కమ్మని వంటకమే మజ్జిగ పులుసులో నానబెట్టిన మినప బోండాల). కమ్మని మజ్జిగ పులుసులో దూదిలా మెత్తగా నానిన బోండాలను లాగిస్తుంటే.. ఆ మజాయే వేరు. దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ కమ్మని వంటకాన్ని సులువుగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మజ్జిగ పులుసు మినప బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి - 2 లేదా 3
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం - అంగుళం ముక్క
మిరియాలు - అర టీస్పూన్
కరివేపాకు - గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
కందిపప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 2 టీస్పూన్లు
బియ్యం - 1 టీస్పూన్
మినపప్పు - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
సన్నగా తరిగిన కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1 (సన్నగా తరగాలి)
అల్లం - చిన్న ముక్క
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పెరుగు - 1 కప్పు
నీళ్లు - అర కప్పు
ఉప్పు - తగినంత
కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 4
కరివేపాకు - కొద్దిగా రెమ్మలు
మజ్జిగ పులుసు మినప బోండా తయారీ విధానం
-ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి 1 గంటసేపు నానబెట్టుకోవాలి.
-తర్వాత బియ్యం, కందిపప్పు, పచ్చిశెనగపప్పు విడివిడిగా అరగంటసేపు నానబెట్టుకోవాలి.
-అరగంట తర్వాత మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి,జీలకర్ర,ధనియాలు,అల్లం,మిరియాలు,పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పచ్చి శెనగపప్పు,కరివేపాకు వేసి,కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా చిలకాలి. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి కలుపుతూ వేడి చేయాలి. మిశ్రమం పైకి నురగ వస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరగనివ్వకూడదు.
-మరోవైపు, గంటపాటు నానబెట్టిన మినపప్పును మిక్సీ గిన్నెలో వేసి చాలా తక్కువ నీళ్లు పోస్తూ గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, చేత్తో బాగా గిలకొట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, బోండాలు మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి, పిండిని చిన్నచిన్న బోండాలుగా వేసుకుని, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
-వేడివేడిగా ఉన్న బోండాలను తీసి, గోరువెచ్చగా ఉన్న మజ్జిగ పులుసులో వేయాలి.
-చివరగా నూనెలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని, ఆ తాలింపును మజ్జిగ పులుసులో కలుపుకోవాలి.
-అంతే కమ్మని మజ్జిగ పులుసు మినప బోండా రెసిపి రెడీ. వేడివేడి అన్నంతో వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications