Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Energy Kheer: టీ,కాఫీ బదులు ఇది 1 కప్పు తాగితే చాలు..జన్మలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..ఎలా చేసుకోవాలంటే
టీ, కాఫీ రోజులో ఒక్కసారైనా తాగకపోతే చాలామందికి పొద్దుపోదు. అయితే మనం రోజూ తాగే టీ,కాఫీలకు ఓ కప్పు సగ్గుబియ్యం మఖానా ఖీర్ తాగి చూడండి.. మీ శరీరంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. సగ్గుబియ్యం మఖానా పాయసం అనేది రుచికరమైన, పోషకమైన స్వీట్. ఇది తక్కువ సమయంలో తయారుచేయడానికి వీలవుతుంది, ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అల్పాహారంగా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం, మఖానా రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల ఈ పాయసం ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. ఎంటిత నీరసాన్నైనా తగ్గించి సత్తువనిస్తుంది ఈ పాయసం. నొప్పులను కూడా మాయం చేస్తుంది. ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అందించే సగ్గుబియ్యం మఖానా పాయసం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బెల్లం
-సగ్గుబియ్యం
-మఖానా
-బాదంపప్పు
-పిస్తాపప్పు
-నెయ్యి
-యాలకలు
-కుంకుమ పువ్వు
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీ విధానం
-ముందుగా పెద్ద సైజులో ఉండే అరకప్పు సగ్గుబియ్యం కనీసం 2 గంటలు నీళ్లలో నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు తురిమిన బెల్లం వేసి,ఇందులోనే పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత 1 నిమిషం వేడి చేసా గిన్నెను పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్తి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక 1 కప్పు పూల్ మఖానా వేసి ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఓ ఫ్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే మూడున్నర కప్పుల పాలు(750 ml) పోసి అవి పొంగువచ్చేదాకా మరిగించుకోవాలి.
-పాలు మరగడం ప్రారంభమయ్యాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలపండి. ఇందులో కొంచెం కుంకుమ్మ పువ్వు కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి
-ఇదే సమయంలో ఓ మిక్సీ గిన్నెలో 10 బాదంపప్పులు, 1 టీస్పూన్ పిస్తా పప్పు, 4 యాలకలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బాదం పిస్తా పొడిని వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించాక ఇందులో సన్నగా తరిగిన 5 బాదంపప్పు ముక్కలు,ఫ్రై చేసి ఉంచిన పూల్ మఖానా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలో ముందుగా తయారుచేసుకున్న బెల్లం సిరప్ ని వడకట్టి పోసి బాగా కలపండి. అంతే టేస్టీ సగ్గుబియ్యం మఖానా ఖీర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





