Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుతం మనకు మార్కెట్లో, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా పచ్చటి జామకాయలు కనిపిస్తున్నాయి. జామకాయను చూడగానే కోసుకుని, కాస్త ఉప్పు, కారం చల్లుకుని తినడమే మనకు అలవాటు.
కానీ జామకాయతో ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే రుచికరమైన చట్నీని కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?పుల్లపుల్లగా, కారంకారంగా, అద్భుతమైన రుచితో ఉండే ఈ విభిన్నమైన చట్నీని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ లొట్టలేసుకుని తింటారు.

జామకాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
దోర జామకాయలు - 3
సాంబార్ ఉల్లిపాయలు- అర కప్పు
నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - పావు టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 5
చింతపండు - ఒక చిన్న అంగుళం ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండు మిర్చి - 1
కరివేపాకు - 1 రెమ్మ
జామకాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా సగం పండిన (దోరగా ఉన్న) జామకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేసి ముక్కలను పక్కన పెట్టుకోండి.
-ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో జామకాయ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడి నీటిలోనే ముక్కలను మరో రెండు నిమిషాలు ఉంచి, ఆ తర్వాత నీరంతా వంపేసి జామకాయ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి మీడియం మంట మీద దోరగా వేయించిన తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసి మరో నిమిషం వేయించి, ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చాలి.
-అదే పాన్ లో అవసరమైతే ఇంకో చుక్క నూనె వేసి తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, మెత్తగా అయ్యి లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన పప్పులు, ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి నీళ్లు పోయకుండా మెత్తగా పౌడర్ లా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న జామకాయ ముక్కలను కూడా అదే మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. అవసరమైతేనే అతి తక్కువగా నీటిని కలుపుకోండి. రుబ్బిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చివరగా ఒక చిన్న పాన్ లో ఒక చెంచా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి వేయించాలి. వేడి వేడి తాలింపును నేరుగా జామకాయ చట్నీపై పోసి బాగా కలపాలి. అంతే జామకాయ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications