Latest Updates
-
ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ..దేంతో తిన్నా అదిరిపోయే మహారాష్ట్ర స్పెషల్ వెల్లుల్లి కారం! -
తల నుంచి కాలి వరకు..శరీరంలో ప్రతి భాగాన్ని హెల్తీగా ఉంచే హెల్తీ ఫుడ్స్ -
ఈ ఆదివారం ఈ 5 రాశుల వారికి కాసుల వర్షం.. అదృష్టం మీ వెంటే! -
ఏ కూరైనా అమృతంలా మారాలంటే.. గరం మసాలా ఎప్పుడు,ఎలా వేయాలో తెలుసా? -
భాగస్వామి విషయంలో ఈ ఒక్కటి ఆపేస్తే.. ఇక మీ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.! -
ఆలయాల్లో రథోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? -
ధనూ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: వీసా, విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అద్భుతమైన సమయం! -
మిథునం, కన్య, కుంభ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 28 జూన్ నుండి 04 జూలై 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - ఆదివారం, 28 జూన్ 2026 -
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు!
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గాలని డైట్ చేసే వారికి తరచుగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. రుచికరమైన ఆహారాన్ని మిస్ అవ్వడం. ముఖ్యంగా నోరూరించే సగ్గుబియ్యం కిచిడీని చూస్తే ఎవరికైనా ఇట్టే తినాలనిపిస్తుంది. కానీ అందులోని కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు చూసి డైట్ పాడవుతుందని వెనకడుగు వేస్తుంటారు. అయితే అచ్చం సగ్గుబియ్యం కిచిడీ లాంటి రుచిని, రూపాన్ని ఇస్తూనే.. బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడే ఒక రెసిపీ జొన్న కిచిడీ. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే జొన్న కిచిడీ నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.

జొన్న కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
జొన్నలు - 1 కప్పు
నానబెట్టడానికి - తగినన్ని వేడి నీళ్లు
తాజా పెరుగు - 4 కప్పులు
కీరదోసకాయలు - 2
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు- ముప్పావు కప్పు
పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్- 2 టీస్పూన్లు
తురిమిన పనీర్ - అర కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం -రుచికి సరిపడా
జొన్న కిచిడి తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకుని నీళ్లలో 5 నుంచి 6 సార్లు శుభ్రంగా కడగాలి. జొన్నలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి, వాటిని వేడి నీళ్లలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి.
-జొన్నలు బాగా ఉబ్బి నానిన తర్వాత, కుక్కర్ లో వేసి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. జొన్నలు కాస్త పారదర్శకంగా (ముత్యాల్లాగా) మారిన తర్వాత కుక్కర్ దించేయాలి. అందులో మిగిలిన అదనపు నీటిని వడకట్టి ఉడికిన జొన్నలను పక్కన పెట్టుకోవాలి.
-ఈ కిచిడీకి కాంబినేషన్ గా కీరదోస రైతా అద్భుతంగా ఉంటుంది. ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకుని, అందులో ముందుగా తురిమి పెట్టుకున్న కీరదోసకాయ, కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి చల్లబడనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి-కొత్తిమీర తరుగు, వేయించి క్రష్ చేసుకున్న పల్లీలు, తురిమిన పనీర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద 2 నుంచి 3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-పల్లీలు, పనీర్ మిశ్రమం చక్కగా వేగిన తర్వాత, ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలను పాన్ లో వేయాలి. దీనికి మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం జత చేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన జొన్న కిచిడీ రెడీ. పొగలు కక్కే వేడివేడి జొన్న కిచిడీని, ఫ్రిజ్ లో పెట్టుకున్న చల్లని కీరదోస రైతాతో కలిపి తింటే ఆ రుచే వేరు.
-జొన్నల్లో ఉండే అధిక ఫైబర్ వల్ల ఇది తిన్న తర్వాత చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది, ఆకలి వేయదు. పల్లీలు, పనీర్ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications