Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్!
హడావుడిగా వంట చేస్తే అది ఏమాత్రం రుచిగా ఉండదు. తొందరపాటుతో వండిన ఆహారం రుచిని కోల్పోవడమే కాకుండా, లోపల సరిగ్గా ఉడకదు కూడా. మన వంటగదిలో చాలా రకాల నోరూరించే వంటకాలను చేసే ముందు పదార్థాలను ఉడకబెట్టడం అనేది అత్యంత ముఖ్యమైన తొలి అడుగు. బంగాళదుంపలు, కోడిగుడ్లు, పాస్తా లాంటివి ముందుగా ఉడకబెడితేనే కూర పర్ఫెక్ట్ గా వస్తుంది.

ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదోరియా ప్రకారం. కూరగాయలు, పాస్తా, గుడ్లు లేదా అన్నం ఉడకబెట్టేటప్పుడు మనం ఉపయోగించే నీటి టెంపరేచర్ అత్యంత కీలకం. సరైన ఉష్ణోగ్రత దగ్గర ఉడకబెట్టినప్పుడే పదార్థాలు ముద్దలా అంటుకోకుండా వాటి సహజ రుచి, సువాసన ఏమాత్రం కోల్పోకుండా మృదువుగా తయారవుతాయి. మరి వంటకు ప్రాణం పోసే ఆ సరైన పద్ధతులు ఏమిటో, ఏ పదార్థాన్ని ఎలా ఉడకబెట్టాలో ఇక్కడ చూడండి.
బంగాళదుంపలు
గుమగుమలాడే దమ్ ఆలూ లేదా బంగాళదుంప కుర్మా చేయాలంటే ముందుగా వాటిని ఉడకబెట్టడం తప్పనిసరి. అయితే ఇక్కడే చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బంగాళదుంపలను వేస్తుంటారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. బంగాళదుంపలను ఎప్పుడూ ముందుగా చల్లటి నీటిలోనే వేసి, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. నీరు నెమ్మదిగా వేడెక్కడం వల్ల బంగాళదుంపలు లోపల, బయట ఒకేలా, పూర్తిగా ఉడుకుతాయి. వేడినీటిలో వేస్తే బయట భాగం ముద్దగా మారిపోయి, లోపల గట్టిగానే ఉండిపోతాయి.
గుడ్లు పగలకుండా పర్ఫెక్ట్ గా ఉడకాలంటే
కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు తరచుగా పెంకు పగిలిపోయి, సొన బయటకు రావడం
మనం చూస్తుంటాం. దీనికి ప్రధాన కారణం వాటిని మరుగుతున్న నీటిలో
వేయడమే. గుడ్లు పగలకుండా ఉండాలంటే, వాటిని కూడా ముందుగా చల్లటి
నీటిలోనే వేయాలి. ఆ తర్వాతే గిన్నెను స్టవ్ మీద పెట్టాలి. నీరు
క్రమంగా వేడెక్కడం వల్ల గుడ్డు పెంకుపై ఒక్కసారిగా ఒత్తిడి పడదు,
కాబట్టి అవి పగలకుండా ఉంటాయి. అలాగే లోపల ఉండే పచ్చసొన, తెల్లసొన
రెండూ సమానంగా ఉడుకుతాయి.
{video1}వ
పాస్తా, నూడుల్స్..వేడి నీరు ఉంటేనే సూపర్
వీటిని ఉడకబెట్టే విధానం కూరగాయలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు బబుల్స్ వస్తూ మరుగుతున్నప్పుడు మాత్రమే పాస్తా అందులో వేయాలి. పొరపాటున చల్లటి నీటిలో వేస్తే అవి ముద్దలా, జిగురుగా మారిపోయి పాడవుతాయి. మరుగుతున్న నీటిలో వేయడం వల్ల అవి విడివిడిగా, సరైన ఆకృతిలో వస్తాయి.
క్యాలీఫ్లవర్, బ్రకోలీ
చలికాలంలో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ కు కంటికి కనిపించని
చిన్నచిన్న పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వంటకు ఉపయోగించే
ముందు క్యాలీఫ్లవర్ లేదా బ్రోకలీని ఎల్లప్పుడూ వేడి నీటిలో కొద్దిసేపు
ఉడకబెట్టాలి. ఇలా చేయడం వల్ల పురుగులు చనిపోవడమే కాకుండా,
కూరగాయల్లోని పోషకాలు పాడవకుండా ఉంటాయి. వండేటప్పుడు ఎక్కువసేపు
వేయించాల్సిన అవసరం కూడా ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications