Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నార్త్ ఇండియా స్పెషల్ 'మలై కోఫ్తా'..చపాతీ,రైస్ లోకి అదిరిపోద్ది..ఎలా చేసుకోవాలో చూడండి
తినడానికి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునేవారికి మలై కోఫ్తా ఓ సారి ట్రై చేసి చూడండి. మలై కోఫ్తా అనేది ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది చాలా రుచికరమైనది, క్రీమీగా ఉంటుంది. ఇది ఎక్కువగా రెస్టారెంట్లో దొరుకుతుంది..అయితే దీన్ని మీరు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మలై కోఫ్తా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మలై కోఫ్తా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
పన్నీర్ - 200 గ్రాములు (తురిమినది)
ఉడికించిన బంగాళాదుంపలు - 2
పసుపు - 1/2 టీ స్పూన్
కారం - 1 టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
గరం మసాలా - 1/2 టీ స్పూన్
కసూరి మేథి - 1 టీ స్పూన్
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 10
కిస్మిస్ - 10
ఉప్పు - సరిపడా
నూనె - సరిపడా
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 3 (గుజ్జుగా చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
క్రీమ్ - 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా

మలై కోఫ్తా కూర తయారీ విధానం
-ముందుగా కోఫ్తా ఒక గిన్నెలో పన్నీర్ తరుము, ఉడికించి మాష్ చేసిన బంగాళాదుంపలు, మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు పెట్టి మూసివేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి తయారుచేసుకున్న కోఫ్తాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో బాండీ పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాక టమోటా గుజ్జు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
కూరగాయలే అవసరం లేని రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు..నాకి నాకి తింటారు, ఎలా చేసుకోవాలో చూడండి
-తర్వాత జీడిపప్పు పేస్ట్, క్రీమ్, గరం మసాలా, కసూరి మేథి, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిగా నీరు పోసి గ్రేవీని మరిగించాలి.
-వేయించిన కోఫ్తాలను గ్రేవీలో వేసి 5 నిమిషాలు ఉడికించాలి.అంతే మలై కోఫ్తా రెడీ.
-వేడివేడిగా మలై కోఫ్తా కూరను చపాతీ, నాన్ లేదా అన్నంతో తింటే అదిరిపోతుందంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications