Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
కార్తీకమాసం స్పెషల్..ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా కూరలు చేసుకోడానికి టేస్టీ గ్రేవీ
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత అసాధారణమైనది. ఇది ఆ పరమశివునికి మరియు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెల 21నుంచి కార్తీక మాసం ప్రారంభమైపోయింది. కార్తీక మాసంలో ఆహార నియమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నియమాలలో ముఖ్యమైనది ఉల్లిపాయ, వెల్లుల్లిలను పూర్తిగా త్యజించడం.
కార్తీకమాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చాలామంది కూరలు చేసుకుంటారు. ఉల్లి,వెల్లుల్లి లేకుండా ఒక్క గ్రేవీ చేసుకుంటే ఏ కాయగూరల్లోకి అయినా ఈ గ్రేవీ వేసుకొని కూరలను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఉల్లి,వెల్లుల్లి లేకుండా గ్రేవీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్
-టమాటో
-ధనియాల పొడి
-గసగసాలు
-జీడిపప్పు
-పసుప్పు
-కారం
-పసుపు
-కసూరి మేథీ
-గరం మసాలా
-అల్లం
-మిరియాలు
-జీలకర్ర
-బిర్యానీ ఆకులు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకలు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు ఆయిల్ వేసి వేడెక్కాక ఇందులో 2 బిర్యానీ ఆకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు 6 యాలకలు వేసి చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
-తర్వాత అందులో సన్నగా,పొడవుగా కట్ చేసిన 1 కేజీ టమాటో ముక్కలు, గుప్పెడు జీడిపప్పు, పొట్టు చెక్కి ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఇంచుల అల్లం, 2 స్పూన్ల గసగసాలు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూతపెట్టేయాలి.
-టమాటో ముక్కల్లోని నీరు అంతా ఇగిరిపోయి ముక్కలు మెత్తగా మగ్గేవరకు ఉడకించుకోని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఉడికేటప్పుడ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి.
-బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో టమాటో మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేథీ బాగా నలిపి వేసుకొని మెత్తం అంతా కలిసేలా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. ఎక్కువ వేగితే కారం మాడిపోయి టేస్ట్ మారిపోతదని గుర్తుంచుకోండి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మూతపెట్టిసి చిన్న మంట మీద మధ్యమధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకోవాలి. దీనికి 20-25 నిమిషాల వరకు సమయం పడుతుంది. తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని బాగా చల్లారనిచ్చి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications