ప్రాన్స్ దమ్ బిర్యాని

Prawns Dum Biryani
కావలసిన పదార్ధాలు:
మారినేషన్ కోసం
రొయ్యలు: 1/2kg
పెరుగు: 1tbsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
గరంమసాలాపొడి: 1tsp
పచ్చిమిర్చి: 2
ఉప్పు,కారం: తగినంత
పసుపు: 1/2tsp

రైస్ కోసం:
బాస్మతి రైస్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాలు
లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా, అనాసపువ్వు, మరాటీమొగ్గ,
జాపత్రి,బిర్యానీ ఆకు

గ్రేవీ కోసం:
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 3
టమాటా: 1(ప్యూరీ)
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరంమసాలా పొడి: 1tsp
పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నూనె, నెయ్యి, కొంచెం పాలలో నానబెట్టిన శాఫ్రాన్

తయారు చేయు విధానం:
1. మొదటగా మారినేషన్ కోసం పెరుగులో అన్ని పదార్ధాలు కలిపి, శుభ్రం చేసిన రొయ్యలు వేసి ఒక గంట నాననివ్వాలి.
2. తర్వాత బాస్మతి రైస్ కడిగి ఇరవై నిముషాలు నానబెట్టాలి. ఒక పెద్దగిన్నెలో నీళ్ళు మరిగించి, అందులో మసాలాదినుసులు, పుదీనా కొత్తిమీర, కొంచెం ఉప్పు, రైస్ కూడా వేసి ఉడికించాలి.
3. మూడు వంతులు ఉడికాక వడపోసి రెడీ చేసుకోవాలి. ఈలోగా ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేయించాలి.ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటాగుజ్జు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
4. ఇప్పుడు నానబెట్టుకున్నరొయ్యలు వేసి కలిపి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలాపొడి, తరిగిన పొదీనా, కొత్తిమీర వేసి ఉడికించాలి. గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక బిర్యానీకి అరేంజ్ చేసుకోవాలి.
5. ప్రెషర్ కుక్కర్ లో కొంచెం నూనెవేసి సగం రైస్ పరవాలి. దానిమీద రొయ్యల గ్రేవీ సర్ది, పైన మిగిలిన రైస్ వేయాలి. పైన రెండు స్పూన్ల నెయ్యి, తరిగిన పొదీనా, కొత్తిమీర వేసి కొంచెం పాలలో నానబెట్టిన సాఫ్రాన్ వేసుకోవాలి. చిన్నబర్నర్ మీద తావా పెట్టి దానిమీద ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టి వెయిట్ పెట్టాలి.
6. రెండుమూడు నిమిషాల తరువాత సిమ్ లో పెట్టెయ్యాలి. విజిల్స్ రానక్కరలేదు.ఇలా వెయిట్ పెట్టడం వలన స్టీం బయటికి పోదు. ఒక పావుగంటలో బిర్యానీ ఘుమఘుమ వాసన వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఒకసారి జాగ్రత్తగా కలిపి వేడిగా వడ్డిస్తే ప్రాన్ దమ్ బిర్యానీ నోరూరిస్తుంది.

Story first published: Thursday, November 24, 2011, 16:32 [IST]
Desktop Bottom Promotion