చిరోటి స్వీట్ పూరి

Chiroti Sweet Puri
కావలసిన పదార్థాలు:
మైదా: 1cup
చెక్కర: 1cup
నెయ్యి: 4tbsp
బియ్యప్పిండి: 2tbsp
ఉప్పు: చిటికెడు
నూనె: వేయించడానికి సరిపడా
నీరు: పిండి కలపడానికి

తయారు చేయు విధానము:
1. ఒక గిన్నె లో మైదా వేసుకోవాలి. అందులోకి చిటికెడు ఉప్పు వేయాలి.
2. తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. తర్వాత పిండిని బాగా కలిపి కొద్దిగా నీరు పోసి, పూరి పిండిలా కలపాలి.
3. ఇప్పుడు కలిపిన పిండిని మూత పెట్టి, 30 నిముషాలు నాననివ్వాలి. పిండి నాని తర్వాత మృదువుగా మెత్తగా అవుతుంది.
4. ఇప్పుడు ఆ నానిన పిండిని 5 సమ భాగాలుగా ఉంటలు చేసుకోవాలి. తర్వాత చపాతి పీటపై ఉంటను పెట్టి చపాతీలా చేసుకోవాలి.
5. అన్ని ఉంటలను చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ బియ్యప్పిండి రెండు స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు ఈ బియ్యప్పిండి మిశ్రమాన్ని చపాతీలపై రాయాలి.
8. మరొక చపాతీ తీసుకొని మొదటి చపాతికి కొద్దిగా కింద పెట్టి దానికి కూడా బియ్యప్పిండి మిశ్రమాన్ని రాయాలి. ఇలా అన్నీ చపాతీలు ఒకదాని కింద ఒకటి పెట్టి ప్రతీ చపాతీకి బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.
9. తర్వాత దీనిపై కొంచెం మైదా చిలకరించి మిశ్రమాన్ని పూసిన చపాతీలను చివరి నుంచి చాపలా గుండ్రంగా చుట్టాలి. ఇలా చుట్టిన పిండిని చపాతి పీటపై పెట్టకోవాలి.
10. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క ముక్కను పూరీలా వత్తుకోవాలి, అన్నీ ముక్కలను పూరీలా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు చెక్కర పాకం సిద్దం చేసుకొని..ఈ పూరిలను వేడినూనెలో వేసి కొద్దిగా ఎర్రగా కాలిన వెంటనే పాకంలో వేయాలి ఒక నిమిషం తర్వాత తీసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయాలి అంతే చిరోటి స్వీట్ పూరి రెడీ..

Story first published: Wednesday, June 8, 2011, 16:21 [IST]
Desktop Bottom Promotion