Latest Updates
-
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి
ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండల తీవ్రతకు మన శరీరం సహజంగానే అలసిపోతుంది. ఇలాంటి వాతావరణంలో కడుపుకు తేలికగా ఉండే, త్వరగా జీర్ణమయ్యే, అలాగే శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలని మనందరికీ అనిపిస్తుంది. వేడి వేడి, మసాలాలతో కూడిన ఆహారాలకు బదులుగా, నోటికి రుచిగా తగిలే చల్లని వంటకాలను మనసు కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో ఒక అద్భుతమైన వేసవి వంటకం దోసకాయ(ఖీర్) నీర్ దోస. ఇది తయారు చేయడానికి ఎంతో సులభం, కడుపుకు చాలా తేలికగా ఉంటుంది.
ఈ దోసకాయ నీర్ దోస కేవలం రుచికరమైనదే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దోసకాయలో నీటి శాతం అత్యధికంగా ఉంటుంది కాబట్టి, ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. బియ్యం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పైగా ఈ దోస తయారీలో వాడే నూనె చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, డైట్ చేసే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.
ఖీరా నీర్ దోసె తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
లేత దోసకాయ (ఖీరా) - 1
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
ఉప్పు -సరిపడా
నీళ్లు - తగినన్ని
జీలకర్ర - అర టీస్పూన్
ఖీరా నీర్ దోసె తయారీ విధానం
-ముందుగా 3-4 గంటల పాటు బియ్యం నానబెట్టుకోవాలి
-నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, తొక్క తీసి తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ నీర్ దోస పిండి సాధారణ దోస పిండిలా కాకుండా నీళ్లలా పల్చగా ఉండాలి. కాబట్టి పిండి నునుపుగా తయారైన తర్వాత, తగినన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు, కాస్త జీలకర్ర వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పెనం పెట్టి వేడి చేయాలి. పెనం మరీ ఎక్కువగా వేడెక్కకూడదు. మీడియం మంట మీద ఉంచి, పెనానికి కొద్దిగా నూనె రాసి, ఒక గరిటెడు పిండిని పెనం అంచుల వెంబడి పోయాలి. సాధారణ దోసలాగా గరిటెతో రుద్దకూడదు. పిండి దానంతట అదే పల్చగా పరుచుకుంటుంది. ఇప్పుడు పైన ఒక మూత పెట్టి ఒకటి, రెండు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-ఈ నీర్ దోసెను రెండో వైపు తిరగేయాల్సిన అవసరం లేదు. దోస అంచులు వాటంతట అవే పైకి లేస్తున్నప్పుడు, చాలా సున్నితంగా తీసి ప్లేట్ లోకి మార్చుకోవాలి.
-ఖీరా నీర్ దోసెను కొబ్బరి చట్నీ, పుదీనా పచ్చడి లేదా ఏదైనా తేలికపాటి కూరగాయల కుర్మాతో కలిపి తింటే ఆ రుచే వేరు. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి పూట తేలికపాటి డిన్నర్ గా తీసుకోవడానికి ఇది అద్భుతమైన ఛాయిస్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













