కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా..

Posted By:

ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. అందులోనూ మటన్ పాయా అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పాయా అనగానే దాని అద్భుతమైన రుచి, ఎముకల నుండి కరిగి వచ్చే జిగురు గుర్తుకొస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఎముకల బలానికి పాయా ఎంతో మేలు చేస్తుంది. అయితే పాయా వండాలంటే చాలా కష్టం, గంటల తరబడి ఉడికించాలి అని భయపడేవారే ఎక్కువ. కానీ ఒక గంట కంటే తక్కువ సమయంలోనే రుచికరమైన మటన్ పాయా కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sunday Special Delicious Mutton Paya Curry Recipe in Telugu

మటన్ పాయా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

మటన్ పాయా (మేక కాళ్లు) - 1.5 కేజీలు
నూనె - అర కప్పు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
టొమాటో - 1
చిల్లీ ఫ్లేక్స్ (ఎండుమిర్చి ముక్కలు) - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
జాపత్రి - ఒక చిన్న ముక్క
లవంగాలు - 4 లేదా 5
నీళ్లు - 2 లీటర్లు
గార్నిష్ కోసం: కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం

మటన్ పాయా కర్రీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో అర కప్పు నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.

-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఓ నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే కట్ చేసిన టొమాటో ముక్కలను కూడా వేసి నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-అదే కుక్కర్‌ లో కొద్దిగా నూనెలో దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు వేయాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్‌ ను వేయాలి. ఇందులోనే పసుపు, కశ్మీరీ కారం, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి, నూనె పైకి తేలే వరకు సన్నపు మంటపై ఉడికించాలి.

-నూనె పైకి తేలుతున్న సమయంలో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ పాయా (మేక కాళ్లు) వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి మసాలా అంతా ముక్కలకు పట్టేలా 5 నుండి 7 నిమిషాల పాటు బాగా వేయించాలి.

-పాయా ముక్కలు మసాలాలో బాగా వేగిన తర్వాత అందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి, సుమారు 45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాయా ఎంత మెత్తగా ఉడికితే గ్రేవీ అంత రుచిగా ఉంటుంది.

-ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే పాయా కర్రీ రెడీ. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, పొడవుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి.

-ఈ వేడి వేడి పాయా కర్రీని ఇడ్లీ, దోశ, నాన్, పరోటా లేదా బగారా రైస్‌ తో తింటే ఆ మజాయే వేరు

[ of 5 - Users]
Story first published: Sunday, August 2, 2026, 10:58 [IST]
Desktop Bottom Promotion