Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మేతి మట్టర్ పనీర్ పులావ్
మేతి (మెంతి ఆకు)చాలా పాపురల్ గ్రీన్ హెర్బ్. చాలా ఎక్కువగా ఈ మెంతిఆకులను వంటల్లో ఉపయోగిస్తుంటారు. వివిధ రకాలుగా వండుతారు. ఈ మెంతి ఆకులు కొద్దిగా చేదు ఉండటం వల్ల చాలా మంది ఈ ఆకును ఉపయోగించరు. అయితే ఇందులో వివిధ రకాల విటమిన్స్, పోషకాలు, మినిరల్స్ ఉన్నాయి. ఇంకా ప్రోటీలను, ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ మరియు పొటాషియం అధికంగా ఉన్నాయి.
ఇంత గొప్ప ప్రయోజనాలున్న ఈ ఆకుకూరతో పులావ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. బిటర్ టేస్ట్ ఉండకూదనుకుంటే, ఇందులో పనీర్, మటర్ వంటి వాటిని జోడించి చేస్తే చాలా రుచికరంగా వెరైటీగా ఉంటుంది. కావాలంటే మీరూ ఒక సారి ట్రై చేసి చూడండి...

కావాల్సిన పదార్ధాలు:
బియ్యం: 1glass
మెంతికూర: రెండు కట్టలు(మీడియం సైజ్)
పనీర్: 100grms(అవసరం అయితే ఇంకా ఎక్కువగానే వాడుకోవచ్చు.)
పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం: కొద్దిగా
కొత్తిమీర: 1cup(విడిపించి పెట్టుకోవాలి)
పుదీనా: 1cup(విడిపించి పెట్టుకోవాలి)
పుల్లపెరుగు: 2cups
అల్లం,వెల్లుల్లిపేస్ట్: 2tbsp
గరం మసాలా లేదా బిరియానీ మసాలా పౌడర్ : 1tsp
నెయ్యి: 3tsp
ఉల్లిపాయ: 1(పెద్దది, సన్నగా కట్ చేసుకోవాలి)
టమాటా: 1(పెద్దది, సన్నగా కట్ చేసుకోవాలి)
నూనె: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మెంతి, కొత్తిమీర, పుదీనా ఆకులు కాడలు లేకుండా తీసేసి కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
2. తర్వాత అల్లం, పచ్చిమిర్చి చీలికల్లాగ తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, టమాటా కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి.
3. ఇప్పుడు చిలికిన పెరుగులో ఉప్పు, పసుపు, ఒక చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా తరుక్కున్న పనీర్ ముక్కలు అందులో వేయాలి. ఆ ముక్కలను అలా ఓ అరగంట పాటు నానబెట్టాలి.
4. అంతలోపు బిరియానీ రైస్ కాస్త నెయ్యి వేసి వండేసి, ఉప్పు కలిపేసి పొడిగా ఆరబెట్టుకోవాలి.
5. తర్వాత ఒక పాన్ లో కానీ పెద్ద డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కానీ నెయ్యి లేక నూనె వేసి మిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వలి.
6. తరువాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేయాలి. తరువాత పచ్చిబఠానీ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
7. అలాగే 5-10నిముషాల తర్వాత కడిగి ఉంచుకున్న మెంతిఆకు అందులో వేయాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి. మెంతిఆకు వేగాకా అందులో నానబెట్టిన పనీర్ ముక్కలు, బిరియానీ మసాల పౌడర్, గ్రైండ్ చేసుకుని ఉంచిన కొత్తిమీర-పుదీనా పేస్ట్, కావాలంటే ఒక చెంచా కారం వేసి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మగ్గనివ్వాలి.
8. పైన మిశ్రమం దగ్గర పడినట్లుగా అనిపించాకా ఇందాకా పొడిపొడిగా పెట్టుకున్న రైస్ అందులో కలపాలి. టేస్ట్ చూసి కావాలంటే, ఉప్పు కారాలు కలుపుకోవచ్చు. మిగిలిన నెయ్యి కూడా అందులో కలిపేయాలి.
9. ఒక ఐదు పది నిమిషాలు మొత్తం రైస్ ను స్టౌ మీద అలాగే తక్కువ ప్లేమ్ లో ఉంచి ఆ తరువాత దింపుకోవాలి. కొత్తిమీర, కాస్త తురిమిన పనీర్ తో డేకరేట్ చేసి సర్వ్ చెయ్యాలి.
10. ఇందులోకి మామూలుగా బిరియాలీల్లోకి చేసుకునే ఉల్లిపాయ, పెరుగు రైతా బాగుంటుంది. అందులో ఒక కేరెట్ కూడా గ్రేట్ చేసుకుని కలిపితే బాగుంటుంది.
11. ఇది రెగులర్ బిరియానీ టైప్ కాదు కాబట్టి వెరైటీగా ఉంటుంది. సాదారణా సోనా మసురా బియ్యంతో చేస్తే కూడా బాగుటుంది. అయితే బాస్మతి రైస్ అయితే మరింత టేస్ట్ ఉంటుంది.



Click it and Unblock the Notifications











