Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Jagannath Rath Yatra 2023: జగన్నాథుని విగ్రహం అసంపూర్తిగా ఉండటం వెనక రహస్యమేంటి?
పూరీ జగన్నాత రథ యాత్ర.. ఈ ఆధ్యాత్మిక వేడుక చాలా అట్టహాసంగా, గొప్పగా జరుగుతుంది. మొత్తం 9 రోజుల పాటు ఉండే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. జగన్నాథుడు అన్న బలరాముడు, సోదరి సుభద్రలతో కలిసి గర్భ గుడి నుండి బయటకు వచ్చి వీధుల్లో ఊరేగింపుగా వెళ్తాడు. ఒడిశాలోని పూరీ పట్టణంలో ఈ రథయాత్ర జరుగుతుంది. అలా దీని పూరీ జగన్నాథ రథయాత్రగా పిలుస్తారు. శుక్ల పక్షంలోని రెండో రోజు జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది.
ఈ సంవత్సరం జూన్ 20వ తేదీన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూరీ జగన్నాథుడి గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

చేతులు, కాళ్లు లేని విగ్రహాలు:
పూరీ జగన్నాథు విగ్రహం, అన్న బలరాముడు, సోదరి సుభద్రలా విగ్రహాలు గమనించినట్లైతే.. వాటికి చేతులు, కాళ్లు ఉండవు. దాని వెనక కారణం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. అసలు ఈ విషయం కూడా చాలా మంది గమనించిన ఉండరు. దాని వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాజు ఇంద్రద్యుమ్నుడికి ఓ రోజు కలలో దేవుడు కనిపించి తన గుడి నిర్మించాలని చెబుతాడు. పూరీలోని బంకముహన సమీపంలో ఓ ప్రత్యేకమైన చెక్క దుంగ ఉంటుందని దాంతో తన విగ్రహం తయారు చేయించి ప్రతిష్టించాలని ఆ రాజును ఆదేశిస్తాడు భగవంతుడు. తర్వాత ఆ రాజు బంకముహన వెళ్లగా అక్కడ నిజంగానే ఓ ప్రత్యేకమైన చెక్క ఉంటుంది. దైవ కార్యం తన జరుగుతుందని సంతోషించిన రాజు ఇంద్రద్యుమ్నుడు.. శిల్పులను పిలిపించి ఆ చెక్కతో దేవతా మూర్తుల ప్రతిమలను తయారు చేయాలని చెబుతాడు. కానీ వాళ్లెవరూ ఆ చెక్కతో ప్రతిమను తయారు చేయలేకపోతారు.
వారి ఇనుప పని ముట్లు విరిగిపోతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన శిల్పులను పిలిపించినా ఫలితం ఉండదు. విగ్రహాలను తయారు చేయించడం ఎలా అని మదన పడుతున్న రాజుకు.. విశ్వకర్మ గురించి కొందరు చెబుతారు. ఆ రాజు ఇంద్రద్యుమ్నుడు విశ్వకర్మ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆ చెక్కతో దేవతా మూర్తుల ప్రతిమలను తయారు చేయాలని వేడుకుంటాడు. దానికి సరేనన్న విశ్వకర్మ.. ఆ రాజుకు ఒక షరతు పెడతాడు.
ఆ చెక్కతో జగన్నాథుని ప్రతిమను చెక్కే సమయంలో తనకు, తన పనికి ఎవరూ భంగం కలిగించకూడదని షరతు పెడతాడు. విగ్రహం పూర్తయ్యే వరకూ ఎవరూ దానిని చూడకూడదని అంటాడు. విశ్వ కర్మ షరతుకు ఒప్పుకున్న రాజు.. విశ్వకర్మకు ఓ పెద్ద గది కేటాయిస్తాడు. అందులోకి ఎవరూ వెళ్లకుండా చూసుకుంటాడు. విశ్వకర్మ లోపల పని చేస్తుంటే బయటకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా రెండు వారాలు గడిచిన తర్వాత ఒక రోజు ఉన్నట్టుండి లోపలి నుంచి శబ్దాలు రావడం ఆగిపోతుంది. విశ్వకర్మకు బాగానే ఉన్నాడా, ఏం జరగలేదు కదా అని సందేహిస్తూ, ఆందోళన పడుతూ ఉంటాడు రాజు.
కానీ లోపలికి వెళ్లే సాహసం మాత్రం చేయడు. అయితే విశ్వకర్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని రాజు భార్య గుండిచా చెబుతుంది. దీనికి రాజు అయిష్టంగా ఆ గది తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడ విశ్వకర్మ విగ్రహం దాదాపు పూర్తయిపోయి కనిపిస్తుంది. చేతులు మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. ఆ పని చేస్తుండగానే రాజు లోపలికి రావడంతో విశ్వకర్మ తన పనిని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతాడు.
పూర్తి కాని విగ్రహాలను ఎలా ప్రతిష్టించాలని రాజు ఇంద్రద్యుమ్నుడు మదన పడుతుంటాడు. ఓ రోజు రాజు కలలో కనిపించిన భగవంతుడు.. అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే ప్రతిష్టించాలని చెప్పడంతో వాటినే ప్రతిష్టించి గుడిని ప్రారంభిస్తాడు రాజు.



Click it and Unblock the Notifications











