Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
పరశురాముని గురించి మనకు తెలియని నిజాలు
ముఖ్యమైనవి – పరశురాముడి గురించి తక్కువగా తెలిసిన నిజాలు, పరశురాముడి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమున్న విషయాలు, మీరు పరశురాముడి గురించి తెలుసుకోవాలనుకున్న నిజాలు, పరశురాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఏమిటి.

విష్ణు మూర్తి ఆరవ అవతారమే పరశురాముడు, ఇతను బ్రాహ్మణ సప్తరిషి జమదగ్ని ఆయన భార్య రేణుక కు పుట్టాడు.
త్రేతాయుగంలో జన్మించిన ఈయన హిందూమతంలో ప్రసిద్ది పొందిన ఏడుగురు అమరవీరులలో ఒకడు. ఈన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ, క్షత్రియుల దూకుడు, ధైర్యం కలిగినవాడు, అందుకే ఈనకి 'బ్రాహ్మ-క్షత్రియ’ అనే పేరు వచ్చింది.
ఇతను యుద్ధ తంత్రంలో అద్భుతమైన నైపుణ్యం కలవాడు, ఇతను 21 సార్లు భూమిమీద ఉన్న అవినీతి యోధులను వంటరిగా మట్టికరిపించాడు.
'పరశు’ అంటే 'గొడ్డలి’ అని అర్ధం, ఈ విధంగా 'గొడ్డలి మోసే రాముడు’ లా పరశురాముడి పేరును అనువదించారు.
పరశురాముడు ఒక్కరిని కూడా వదలి పెట్టకుండా తన దరికి అడ్డువచ్చిన ప్రతి ఒక్క క్షత్రియుడిని చంపడానికి సిద్ధమయ్యే వాడని పురాణాలూ చెప్తున్నాయి.
ఈ కారణం వల్ల మిగిలిన బ్రాహ్మణులు అతన్ని త్యజించారు. అతను ఋషుల కోసం జీవనశైలి నిబంధనలను అతిక్రమించిసి హత్యలు చేసినందుకు అపకీర్తిని పొందాడు.
పరశురాముని గురించి మనకు తెలీని ఎన్నో నిజాలు ఇప్పటికీ హిందూ పురాణాలలో దాగి ఉన్నాయి. పరశురాముని గురించి కొద్దిపాటి నిజాలను కొన్నిటిని చదివి తెలుసుకోండి.

పరశురాముడి జన్మస్థలం:
రేణుకా తీర్ధం పరశురాముని జన్మస్థలంగా చెప్పబడింది. ఇది కూడా ఆధునిక కాల మహేశ్వర్ వంశ పరంపరలో జరిగిందని అనుకుంటున్నారు. ఇతని తండ్రి అయిన రిషి జమదగ్ని బ్రహ్మదేవుడి కి వారసుడు.

పుట్టుకతో పెట్టిన పేరు రామభద్రుడు:
ఇతను పుట్టక ముందు, ఇతని తల్లిదండ్రులు శివుడి ఆశీర్వాదం కోసం ప్రార్ధన చేసారు. దీని ఫలితమే వీరికి కలిగిన ఐదవ సంతానం విష్ణుమూర్తి ఆరవ అరవతరం గా జన్మించడానికి దారితీసింది, అతనికే పుట్టుకతో ‘రామభద్రుడు' అని పేరుపెట్టారు.

అతని ఖగోళ ఆయుధం:
అతి చిన్న వయసులోనే పరశురాముడికి ఆయుధాలలో ఆశక్తి ఎక్కువ ఉండేది. అతను శివుడిని మెప్పించడానికి తీవ్రమైన తపస్సు చేసాడు, చివరికి ఖగోళ గొడ్డలిని వరంగా పొందాడు. అయితే, తన ఆధ్యాత్మిక గురువు శివుడని తెలుసుకుని, ఎంతో శక్తిమంతుడని నిరూపించుకున్న తరువాతే ఈ ఆయుధం ఇవ్వడం జరిగి, అతను ‘పరశురాముడు' అని పిలవబడ్డాడు.

అతని గురువుకి, అతనికి మధ్య యుద్ధం:
శివుడు పరశురాముడి యుద్ధ నైపుణ్యాలను పరీక్షించడానికి ఒక సవాలు చేసాడు. గురువుకి, శిష్యుడికి మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం 21 రోజులు కొనసాగింది.

శివుడు, పరశురాముడి యుద్ధ నైపుణ్యాలకు సంతోషించడం:
యుద్ధ సమయంలో, పరశురాముడు శివుని త్రిశూలం నుండి తప్పించుకుంటూ, శివుడి నుదుటిపై తన గొడ్డలిని తగిలించాడు. ఇది చూసి శివుడు, శిష్యుడు యుద్ధ కళలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడని చాలా సంతోషించాడు. అతను గాయాన్ని స్వీకరించి, తన క్రమశిక్షణ కీర్తి శాశ్వతమైనదని నిరూపించుకున్నాడు, అప్పటి నుండి అతను ‘ఖండ-పరశు' గా పిలవబడ్డాడు.

పరశురాముడి చరిత్ర వివేకం గల కుమారుడిగా ఉండడం:
పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకితభావం కల భార్య, బేక్ చేయని బంక మట్టితో నీటిని సేకరించడం ఆమె నమ్మకం యొక్క శక్తికి తార్కాణం. పాపం, ఒకరోజు కుండతో నీళ్ళు నింపుతుంటే, ఆకాశాన గాంధర్వ రధం ప్రయాణిస్తుంటే చూసి ఒక్క క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా, ఆ కుండ నీటిలో కరిగిపోయింది. తన యోగ శక్తుల ద్వారా తన భర్త ఈ విషయాన్నీ తెలుసుకుని, ఎంతో ఆవేశంతో ఆమెను గొడ్డలితో చంపమని తన కుమారునికి చెప్పాడు. పరశురాముడు మినహా ఈపని ఎవరూ చేయలేరు. అతను తన తండ్రి చెప్పినట్లు తల్లిని, నలుగురు అన్నలను నరికేసాడు. తరువాత, తండ్రి అతడిని రెండు వరాలు కోరుకోమన్నాడు, అపుడు అతను తన తల్లిని, అన్నలను బ్రతికించమని కోరాడు, తండ్రి వెంటనే అతనికి వరాలను ప్రసాదించాడు.



Click it and Unblock the Notifications











