Latest Updates
-
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.!
vaikunta ekadashi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఈ 3 పనులు చేస్తే మీ జాతకం మారిపోతుంది,అఖండ ఐశ్వర్యం
ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో తెల్లవారుజామునుంచే కిటకిటలాడుతున్నాయి. శ్రీమహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా ఈ రోజు దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం వైకుంఠ ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచారాల ప్రకారం పూజించడం, వ్రతాన్ని ఆచరించడం, ఉపవాసం పాటిస్తే వారి ప్రతి కోరికను శ్రీహరి తీరుస్తాడు. అయితే ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపద పెరగకపోతే, మీ కష్టాలు కొనసాగుతున్నట్లయితే ఈ రోజున 3 పనులు చేయడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో, ఐశ్వర్యం కలిగి మీ జీవితం ఆహా అనేలా ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన 3 పనులు
కెరీర్ లో పురోగతి కోసం
మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీ కెరీర్లో ఆశించిన విజయం సాధించకపోతే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫొటో ముందు నెయ్యి దీపం వెలిగించండి. చేతిలో నీళ్ళు పట్టుకొని పసుపు పువ్వులు తీసుకుని శ్రీ హరిని ప్రార్థించండి, నారాయణ మంత్రాన్ని పఠించండి. దీని తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని నీటితో నింపి విష్ణువును అభిషేకించాలి. ఇలా చేయడం ద్వారా మీరు వెంటనే ప్రయోజనాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఆర్థిక సమస్యలకు ఇదే పరిష్కారం
వైకుంఠ ఏకాదశి రోజున నిరుపేద వ్యక్తికి ఆహారం తినిపించండి. మీ శక్తి మేరకు నిరుపేదలకు కొన్ని బట్టలు, దక్షిణ ఇవ్వండి. ఈ రోజున ఇలా చేసే వ్యక్తికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు, సంపద వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం,సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు,లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ సంపద అనేక రెట్లు పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ఆనందం, శ్రేయస్సు కోసం
ఆనందం, శ్రేయస్సు కోసం వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్కను నాటండి. దీంతో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ ఇంట్లో కురుస్తాయి. దీంతో ఇంట్లో ఆనందం,శ్రేయస్సు ఉంటుంది. మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.



Click it and Unblock the Notifications