Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
vaikunta ekadashi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఈ 3 పనులు చేస్తే మీ జాతకం మారిపోతుంది,అఖండ ఐశ్వర్యం
ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో తెల్లవారుజామునుంచే కిటకిటలాడుతున్నాయి. శ్రీమహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా ఈ రోజు దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం వైకుంఠ ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆచారాల ప్రకారం పూజించడం, వ్రతాన్ని ఆచరించడం, ఉపవాసం పాటిస్తే వారి ప్రతి కోరికను శ్రీహరి తీరుస్తాడు. అయితే ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపద పెరగకపోతే, మీ కష్టాలు కొనసాగుతున్నట్లయితే ఈ రోజున 3 పనులు చేయడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో, ఐశ్వర్యం కలిగి మీ జీవితం ఆహా అనేలా ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన 3 పనులు
కెరీర్ లో పురోగతి కోసం
మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా మీ కెరీర్లో ఆశించిన విజయం సాధించకపోతే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫొటో ముందు నెయ్యి దీపం వెలిగించండి. చేతిలో నీళ్ళు పట్టుకొని పసుపు పువ్వులు తీసుకుని శ్రీ హరిని ప్రార్థించండి, నారాయణ మంత్రాన్ని పఠించండి. దీని తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని నీటితో నింపి విష్ణువును అభిషేకించాలి. ఇలా చేయడం ద్వారా మీరు వెంటనే ప్రయోజనాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఆర్థిక సమస్యలకు ఇదే పరిష్కారం
వైకుంఠ ఏకాదశి రోజున నిరుపేద వ్యక్తికి ఆహారం తినిపించండి. మీ శక్తి మేరకు నిరుపేదలకు కొన్ని బట్టలు, దక్షిణ ఇవ్వండి. ఈ రోజున ఇలా చేసే వ్యక్తికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు, సంపద వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు వస్త్రదానం,సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు,లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ సంపద అనేక రెట్లు పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ఆనందం, శ్రేయస్సు కోసం
ఆనందం, శ్రేయస్సు కోసం వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్కను నాటండి. దీంతో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ ఇంట్లో కురుస్తాయి. దీంతో ఇంట్లో ఆనందం,శ్రేయస్సు ఉంటుంది. మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు తులసి మొక్కను దానంగా ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.



Click it and Unblock the Notifications











