Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
మహాకుంభమేళా వేళ ఆకాశంలో మహాద్భుతం..దీన్ని చూడటం అస్సలు మిస్ అవొద్దు
ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకుంటారు. అదే రోజున ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళా ముగుస్తుంది. అయితే మహాకుంభమేళా ముగిసిన కొన్ని గంటల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 28 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు రాత్రి సమయంలో సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, వరుణుడు, కుజుడు, శని, యురేనస్ ఒకే లైన్ లోకి రానున్నాయి. ఈ అద్భుత విన్యాసాన్ని భూమి నుంచి నేరుగా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
యురేనస్ , నెప్ట్యూన్ గ్రహాలు చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత నెలలో కూడా యురేనస్ , నెప్ట్యూన్, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే లైన్ లో కనిపించాయి..అయితే ఫిబ్రవరి 28న ఈ లైన్ లోకి బుధుడు కూడా చేరనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్య గ్రహానికి ఒక వైపున చేరి కవాతును సృష్టిస్తాయని, సూర్యుని కక్ష్య ఒకే తలంలో ఉండటం వలన ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ ఏడు గ్రహాలు ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ గ్రహాల విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో చూడొచ్చు. ఆకాశం స్పష్టంగా కనిపించాలి. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున గ్రహాల విన్యాసం స్పష్టంగా కనపడుతుంది . టెలిస్కోప్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహ కూటమిని విశేషమైనదిగా చెప్పబడుతుంది.ఇలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఒకేసారి ఏడు గ్రహాల కవాతు ఇప్పట్లో ఉండదని,ఎందుకంటే ఈ అరుదైన సంఘటన చాలా అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మళ్ళీ జరుగుతుందా?
2025 ఆగస్టు మధ్యలో మరో గ్రహాల కవాతు జరుగుతుందని, అప్పుడు ఉదయం ఆకాశంలో ఆరు గ్రహాలు కనిపిస్తాయి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications