Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మహాకుంభమేళా వేళ ఆకాశంలో మహాద్భుతం..దీన్ని చూడటం అస్సలు మిస్ అవొద్దు
ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకుంటారు. అదే రోజున ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళా ముగుస్తుంది. అయితే మహాకుంభమేళా ముగిసిన కొన్ని గంటల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 28 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు రాత్రి సమయంలో సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, వరుణుడు, కుజుడు, శని, యురేనస్ ఒకే లైన్ లోకి రానున్నాయి. ఈ అద్భుత విన్యాసాన్ని భూమి నుంచి నేరుగా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
యురేనస్ , నెప్ట్యూన్ గ్రహాలు చాలా మసకగా ఉండటం వలన బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత నెలలో కూడా యురేనస్ , నెప్ట్యూన్, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే లైన్ లో కనిపించాయి..అయితే ఫిబ్రవరి 28న ఈ లైన్ లోకి బుధుడు కూడా చేరనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్య గ్రహానికి ఒక వైపున చేరి కవాతును సృష్టిస్తాయని, సూర్యుని కక్ష్య ఒకే తలంలో ఉండటం వలన ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ ఏడు గ్రహాలు ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ గ్రహాల విన్యాసం స్పష్టంగా చూడాలంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశంలో చూడొచ్చు. ఆకాశం స్పష్టంగా కనిపించాలి. సూర్యాస్తమయం తర్వాత లేదా తెల్లవారుజామున గ్రహాల విన్యాసం స్పష్టంగా కనపడుతుంది . టెలిస్కోప్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహ కూటమిని విశేషమైనదిగా చెప్పబడుతుంది.ఇలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఒకేసారి ఏడు గ్రహాల కవాతు ఇప్పట్లో ఉండదని,ఎందుకంటే ఈ అరుదైన సంఘటన చాలా అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మళ్ళీ జరుగుతుందా?
2025 ఆగస్టు మధ్యలో మరో గ్రహాల కవాతు జరుగుతుందని, అప్పుడు ఉదయం ఆకాశంలో ఆరు గ్రహాలు కనిపిస్తాయి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











