Latest Updates
-
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
ఒక సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికి అయినా పనివేళలు తప్పనిసరి. ఇది కార్మిక హక్కుల్లో ప్రధానమైనది. పనివేళలకి మించి పనిచేయడం ద్వారా వారి ఆరోగ్యంపైనా, వ్యక్తిగత, కుటుంబ జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్.. రంగం ఏదైనా పనివేళలకు మించి చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఓ బ్యాంకు బ్రాంచ్లో పనివేళలు ముగిసినా ఉద్యోగులు పని పూర్తయ్యే వరకు బయటరకు వెళ్లకుండా ప్రధాన గేటుకు తాళం వేసిన ఘటన సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

మన దేశంలో వర్క్ కల్చర్పై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. కార్యాలయ వాతారణం, ఉద్యోగులతో పై స్థాయి అధికారులు వ్యవహరించే తీరుపై సోషల్ మీడియాలో చర్చలు, ప్రశ్నలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పని తీరుపై బహిరంగంగా తోటి ఉద్యోగుల ముందు అవమానించడం, మందలించడం వంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీని వల్ల ఉద్యోగులు లక్ష్యాన్ని సాధించేందుకు శారీరక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ పని సంస్కృతిపై మళ్లీ చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం ప్రకారం.. బ్యాంకు సిబ్బంది పని వేళలు పూర్తయిన అనంతరం తమ విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు బయటకు వెళ్లకుండా బ్యాంకు మేనేజర్ మెయిన్ గేటుకు తాళం వేశారు. పని పూర్తయిన తర్వాతే ఇంటికి వెళ్లాలంటూ మేనేజర్ గట్టిగా చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఉద్యోగులు ఆఫీసు టైం ముగిసిందని.. తాము ఇంటికి వెళ్లాలని చెబుతున్నప్పటికీ వారి అభ్యర్థనను వినిపించుకోలేదు. పని పూర్తయ్యేవరకు ఉద్యోగులు బయటకు వెళ్లకూడదని మేనేజర్ స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందనే దానిపై ధ్రువీకరణ సమాచారం లేదు. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పని సంస్కృతి, ఒత్తిడిపై చర్చకి దారితీసింది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది బాధ
మేనేజర్ గేటుకి తాళం వేస్తున్న క్రమంలో తమ విధులు పూర్తయ్యాయని.. తమను బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఉద్యోగులు వివరించారు. ఓవర్టైమ్ తప్పనిసరి కాదని చెప్పినా కూడా మేనేజర్ వినిపించుకోకుండా గేటుకి తాళం వేసి వెళ్లిపోతారు.
నెటిజన్ల అభిప్రాయం
దీంతో ఈ వీడియోలో మేనేజర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఉద్యోగి హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఉద్యోగులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా కార్యాలయంలో ఉంచడం సరికాదన్నారు. బలవంతంగా ఓవర్టైమ్ పనిచేయడం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. దీనిని విషపూరితమైన సంస్కృతికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. దీంతో ఈ వీడియో నిజమో కాదో అధికారికంగా ధ్రువీకరణ లేనప్పటికీ.. మేనేజర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం దేశంలో వర్క్ కల్చర్పై మరోసారి చర్చనీయాంశమైంది.



Click it and Unblock the Notifications