Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
స్నానం చేయడానికి సరైన పద్ధతి ఉందంటే నమ్ముతారా.? ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ తప్పుగా స్నానం చేసే పద్ధతుల ద్వారా ఆరోగ్యానికి హాని కలుగజేస్తుందని మీకు తెలుసా.? ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతిలో స్నానం చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మరి సరైన విధానం ఏంటి.? ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేవగానే మన దైనందిన జీవితం కాలకృత్యాలు అనంతరం స్నానం చేసిన తర్వాత మొదలవుతుంది. అయితే తలస్నానం చేసేటప్పుడు చాలా మంది నేరుగా తలపై నీళ్లు పోసుకుంటారు. కానీ ఇది సరైంది కాదు. ఆయుర్వేదం ప్రకారం మీ శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణను పరిగణనలోకి తీసుకుని స్నానం చేయాలి. ముఖ్యంగా జలుబు, తల నొప్పి, రక్తపోటు సమస్యలు ఉన్నవారు.. తలపై అకస్మాత్తుగా చల్లటి నీరు పోసుకుంటే అది నేరుగా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉన్న వారి కారణంగా ఆరోగ్య స్థితిని బట్టి అలవాట్లలో మార్పులు ఉంటాయి. ఈ క్రమంలో ఆయుర్వేద శాస్త్రం మేరకు స్నానం చేసేటప్పుడు సరైన పద్ధతి ఏంటి.. శరీరంలో మొదటగా ఏ భాగంపై నీళ్లు పోసుకోవాలో చూద్దాం..
ముందుగా పాదాలపై నీళ్లు..
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ముందుగా స్నానం చేసేటప్పుడు పాదాలతో ప్రారంభించాలి. మొదటగా పాదాలపై నీళ్లు పోయడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా శరీరం క్రమంగా నీటి ఉష్ణోగ్రతకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత చేతులు, శరీరం చివరిగా తలపై నీళ్లు పోసుకుని స్నానం ప్రారంభించాలి. తద్వారా మీ బాడీ సౌకర్యవంతంగా ఫీలవుతుంది.
తలపై నీళ్లు పోయడం శ్రేయస్కరమేనా
తలస్నానం చేసేటప్పుడు చాలా మంది నేరుగా తలపై నీళ్లు పోసుకుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. తల భాగంలో హఠాత్తుగా నీళ్లు పోయడం ద్వారా కొందరిలో తల నొప్పి, కళ్లు తిరగడం, అసౌకర్యంగా ఫీలవడం వంటివి తలెత్తవచ్చు. మైగ్రేన్, సైనస్ సమస్యలు ఉన్నవారు, రక్తపోటు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

శరీర ఉష్ణోగ్రత
స్నానాన్ని మొదటగా పాదాలపై నీళ్లు పోయడంతో ప్రారంభించిన తర్వాత నీటి ఉష్ణోగ్రతకు శరీరం అలవాటు పడి ఆకస్మిత ఉష్ణోగ్రత మార్పుల వల్ల కలిగే అసౌకర్యం నుంచి బయటపడుతుంది. రోజులో ఉదయం సమయంలో స్నానం చేయడం ద్వారా శరీరం, మనసు ఉత్తేజకరంగా ఉంటుంది.
ఆయుర్వేద టిప్స్
స్నానం చేసేటప్పడు మరీ చల్లటి నీరు, మరీ వేడి నీరు ఉపయోగించకూడదని ఆయుర్వేదం చెబుతుంది. అధిక వేడి నీటి ద్వారా చర్మంపై సహజ తేమ తొలగిపోతుంది. మీ శరీర అవసరాలను బట్టి నీటి ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. స్నానానికి ముందు నూనెతో శరీరానికి తేలికపాటి మర్దన చేయండి. ఇలా చేయడం ద్వారా మీ బాడీకి తేమ అంది తగిన విశ్రాంతి లభిస్తుంది. ఎక్కువ సేపు నీటిలో ఉండకండి. లేదంటే చర్మం పొడిబారుతుంది. స్నానం తర్వాత శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి. శుభ్రమైన, పొడి టవల్ వాడటం ద్వారా చర్మ సమస్యలు రాకుండా నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications