Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మంచం మీద కూర్చొని తింటున్నారా? వాస్తు శాస్త్రం చెబుతున్న భయంకరమైన నిజాలు!
తమ ఇళ్లల్లో మంచం మీద కూర్చొని అన్నం తినడం లేదా ఇతర ఆహారాలు తినడం చాలామందికి ఉండే అలవాటే. ఎవరైనా పెద్దవారు వచ్చి మంచం మీద కూర్చొని తినకూడదు అంటే ఏ పో అంటూ కసురుకుంటుంటారు. హాయిగా ఫోన్ వాడుతూ లేదా టీవీ చూస్తూ మంచం మీద కూర్చొని తినడం అలవాటుగా మారిపోయింది.
అయితే మంచం మద కూర్చొని తినడం కంఫర్ట్ గా అనిపించినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మోస్ట్ డేంజరస్ అలవాటు. అన్నంని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే మన పెద్దలు భోజనానికి అంతటి పవిత్రతను ఇచ్చారు. మరి మంచం మీద తినడం వల్ల ఏమవుతుంది? భోజనం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి?

మంచం మీద తినడం వల్ల ఏమవుతుంది
-వాస్తు శాస్త్రం ప్రకారం మంచం అనేది నిద్రకు, విశ్రాంతికి సంబంధించిన ప్రదేశం. అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అన్నాన్ని అగౌరవపరచినట్లవుతుంది. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తడమే కాకుండా, పేదరికం, దారిద్ర్యం వచ్చే అవకాశం ఉంది.
-మంచం మీద తినేటప్పుడు ఆహారపు మెతుకులు పడటం సహజం. ఇలా పడకగదిలో ఆహారం చిందించడం వల్ల రాహువు ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. జాతకంలో రాహు దోషం ఉంటే జీవితంలో ఊహించని అడ్డంకులు, మానసిక ఒత్తిడి, భయాలు కలుగుతాయి.
-మంచం విశ్రాంతి స్థలం.. అక్కడ భోజనం చేయడం వల్ల ఆ ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. నిద్రలేమి సమస్యలు రావడమే కాకుండా, పీడకలలు రావడం, మనసులో అశాంతి కలగడం వంటివి జరుగుతాయి.
-ఈ అలవాటు కేవలం ఇంటికే కాదు, వ్యక్తిగత ఎదుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం, ఉద్యోగంలో చికాకులు, విజయానికి దూరమవ్వడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనం చేయడానికి సరైన దిశ ఏది?
-వాస్తు ప్రకారం మనం కూర్చునే దిశ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తూర్పు..భోజనం చేయడానికి ఇది అత్యుత్తమమైన దిశ. తూర్పు వైపు ముఖం చేసి తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
-కెరీర్ పరంగా విజయం సాధించాలనుకునేవారు, విద్యార్థులు, ఆర్థిక లాభం కోరుకునే వ్యాపారస్తులు ఉత్తరం వైపు ముఖం చేసి భోజనం చేయడం చాలా మంచిది. ఇది జ్ఞానాన్ని,సంపదను ఇస్తుంది.
సరైన భోజన పద్ధతి
-నేల మీద బాసిపట్టు వేసుకుని (సుఖాసనంలో) కూర్చుని తినడం వల్ల పొట్ట దగ్గరి కండరాలు ఉత్తేజితమై జీర్ణక్రియ అద్భుతంగా జరుగుతుంది. ఇది భూమి నుండి పాజిటివ్ ఎనర్జీని గ్రహించడానికి సహాయపడుతుంది.
-భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, నోరు కడుక్కోవడం భారతీయ సంప్రదాయం. ఇది శరీరాన్ని చల్లబరిచి, భోజనానికి సిద్ధం చేస్తుంది.
-ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ మీద తింటున్నా సరే మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. దక్షిణ దిశ వైపు ముఖం చేసి ఎప్పుడూ తినకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











