బియ్యం నుంచి రక్తం పుట్టించవచ్చా..?

Rice Produce Blood..?
''బియ్యపు గింజ నుంచి మానవ రక్తం ప్రవహిస్తే...?, రక్తానికి కొదవుండదమో.. రక్తదానాలు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదేమో!!, జన్యుపరంగా మార్పు చేసిన బియ్యం నుంచి మనవ రక్తాన్ని ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు చైనా పరిశోధకులు. ఇందు కోసం పంట పొలాలను జీవశాస్త్ర ప్రయోగానికి వేదికగా ఎంచుకున్నారు.''

ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనాన్ని సెంట్రల్ చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో డాక్టర్ దాయ్‌చాంగ్ యాంగ్ బృందం నేతృత్వంలో నిర్వహించారు. వీరు ఎలుకలపై అనేక పరిశోధనలు జరిపారు. బియ్యం నుంచి ఉత్పత్తి చేసిన రక్తాన్ని ఎలుకల్లో ఉపయోగించినపుడు వాటిలో ఎలాంటి ప్రతికూల చర్యలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

రక్తంలో కీలకమైన ప్రొటీన్ 'హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్'(హెచ్ఎస్ఏ)ను బియ్యం నుంచి అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పక్రియ కోసం వరి వంగడాల్లో మానవ జున్యువులను ప్రవేశపెట్టి వైద్య పరంగా ఉపయోగపడే విధంగా కొత్త వంగడాన్ని అభివద్ది చేశారు. అనంతరం రైస్ సీడ్ బయోరియాక్టర్ ను ఉపయోగించి బియ్యపు గింజల నుంచి హెచ్ఎస్ఏ బయటకు తీయగలిగారు. ఇది మానవ రక్తంలోని ప్రొటీన్ కు ఏమాత్రం తీసిపోదు.

హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్' అనేది మానవ రక్తంలో ప్రధానంగా ఉండే ప్రొటీన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రొటీన్ కొరత తీవ్రంగా ఉంది. తాజా విధానం ద్వారా బియ్యం నుంచి భారీ ఎత్తున మానవ రక్తాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రక్తం కొరత తీరుతుంది. భారీ సంఖ్యలో రోగులకు మేలు జరుగుతుంది. ఇప్పుటి వరకు మనుషులు నుంచి సేకరించిన రక్తం ద్వారా హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. అదే, బియ్యం నుంచి రక్తం ఉత్పత్తి అయితే అలాంటి ముప్పు కూడా ఉండదు.

పరిశోధన వివరాలను 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'కు చెందిన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.

Story first published: Sunday, November 20, 2011, 10:43 [IST]
Desktop Bottom Promotion