Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు...

1. నిమ్మరసం: చాలా తేలిక అయిన చిట్కా ఇది. టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిలమిల మెరుస్తుంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
2. పెరుగు: ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.
3. పాలు: ముఖం మీద మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో బాగా ఉపకరిస్తుంది. చర్మంలోపలిదాకా వెళ్ళి మురికిని తొగించడమే కాకుండా ర్మం మెరిసేలా చేస్తుంది.
4. టమోటో రసం: టమోటో రసాన్ని స్నానాకి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం న్నానం చేస్తే మంచిది.
5. ఓట్ మీల్: ఓట్ మీల్, బాదం పప్పులను పొడిచేసి దానిలో పాలు, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచిది.
6.శాండిల్ ఉడ్: శాండిల్ ఉడ్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications