పాలతో పసిడి వన్నెలు...

Milk and Rose water Skin Care tips
ఈ సీజన్ లో పొడిచర్మం కల వారికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుండి. చర్మం తెల్లగా మారి కాంతి విహీనంగా తయారవుతుంది. అటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

1. గుడ్డులోని తెల్ల సొనకు ఒక టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత స్నానం చేస్తే పొడిచర్మం వారిక చక్కటి ఫలితం ఉంటుంది.

2. ఒక టీస్పూను తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృ దువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృతకణాలను తొలగించి..చర్మానికి తేమనందిస్తుంది.

3. బాగా పండిన అరటి పండు గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి మర్దన చేసి అరగంటయ్యాక గోరువెచ్చటినీళ్లతో కడిగేస్తే చర్మం మొత్తబడుతుంది. రెండు టీస్పూన్ ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పాలు, పావు టీస్పూన్ తేనె కలిపి పూతవేసుకోవాలి. ఆరాక శుభ్రపరిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

4. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ వేడి చేసి..అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువుగా తయారవుతుంది.

5. నీళ్లను వేడి చేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్ది సేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటినీటితో ముఖం కడుక్కుంటే..ఈ కాలంలో చర్మానికి తేమ అందుతుంది.

Story first published: Thursday, January 12, 2012, 12:09 [IST]
Desktop Bottom Promotion