మండే ఎండల్లోనూ శరీరం తాజాగా.....

Summer Season take care of your Skin
మండే సూర్యడు తన ప్రతాపం చూసే వేసవికాలం వచ్చేసింది. భరించలేని వేడి, ఉష్టోగ్రత అధికం. దీనితోపాటు ఈ కాలంలో అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు అధికం కాబట్టి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేసవిలో శరీరం తాజాగా కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి.

1. స్నానం చేసేటపుడు నీటిలో కాస్త గ్లిజరిన్‌ వేయండి. ఇందువల్ల శరీరం తాజాగా ఉంటుంది.
2. మామిడిపండు రసం నాలుగు చెంచాలు తీసుకుని, దీనికి అరచెంచా పసుపు కలపండి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక కడిగేస్తే, మొటిమలు, వాటితాలూకు మచ్చలు నివారిస్తుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
3. శిరోజాలలో జిడ్డు తొలగి బాగా కనపడాలనుకునేవారికి ఈ ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది. కప్పు హెన్నా పొడిలో పావు కప్పు కాఫీగింజల పొడి, చెంచా వెనిగర్‌ చేర్చి వేడినీటితో ముద్దగా చేసి, దీనిని నిద్రించేముందు జుట్టు మొత్తానికి పట్టించి తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకోవాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి.
4. సెనగపప్పును బరకగా మర పట్టించాలి. ఈ పిండిని కప్పు తీసుకుని చెంచా నిమ్మరసం, రెండుచెంచాల పాలు కలపాలి. దీనిని స్నానం చేసేటపుడు నలుగులా ఉపయోగించవచ్చు. ఇది చెమటవాససను దూరం చేయడంతోపాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
5. అధికంగా నీరు త్రాగటం వల్ల శరీరానికి కావలసిన నీరు అందించిన వాళ్ళం అవుతాం. దాంతో చర్మం ఫ్రెష్ గా ఉంటుంది . నీరంటే కేవలం దప్పిక తీర్చేదిగా భావిస్తూ రోజుకు గ్లోసో, మహా అయితే రెండు గ్లాసులో నీరు త్రాగేవారు అధికంగా ఉన్నారు మనలో. కానీ మనిషి ారోగ్యం వంతునిగా ఉండాలంటే అధికంగా నీరు త్రాగడం కూడా అవసరం. ఒక రోజుకు 8 నుండి 10గ్లాసుల నీరు త్రాగడం వల్ల మనిషి శరీర ఆరోగ్యం బాగుంటుంది.

Story first published: Tuesday, February 21, 2012, 11:54 [IST]
Desktop Bottom Promotion