Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నిగారింపు అయిన చర్మానికి కూరగాయలతో ఫేషియల్స్...

1. వేసవిలో ఎండ వేడికి ముఖం నిస్తేజంగా మారటం, కళ్ళు మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళాదుంపని సగం వరకు చక్రాల్లా కట్ చేసి నుదురు, కళ్ళపై పెట్టుకోవాలి. మిగిలిన సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకొవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు స్వాంతన నివ్వడమే కాక, చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా చేస్తుంది.
2. పొదీన ఆకుల్నిమెత్తగా పేస్ట్ చేసి దానికి రోజ్ వాటర్ చేర్చిముఖానికి రాయాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా, మెటిమలు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
3. ముల్లంగిని మొత్తని పేస్టులా చేసుకొని రసం వేరుచేయాలి. దీనికి రెండు * ముల్లంగిని మెత్తని గుజ్జులా చేసి రసం వేరుచేయాలి. దీనికి రెండు టీస్పూన్ పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
4. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
5. జిడ్డు చర్మంగల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేరుచేయాలి. ఇందులో పావుచెంచా నిమ్మరసం, చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాని రోజుకు రెండుసార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మించి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తంది.
6. పొడి చర్మం గలవారు ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్దన చేయాలి. పావుగంట తర్వాత ఈ ప్యాక్ ను తడిదూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications