Latest Updates
-
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం!
నిగారింపు అయిన చర్మానికి కూరగాయలతో ఫేషియల్స్...

1. వేసవిలో ఎండ వేడికి ముఖం నిస్తేజంగా మారటం, కళ్ళు మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళాదుంపని సగం వరకు చక్రాల్లా కట్ చేసి నుదురు, కళ్ళపై పెట్టుకోవాలి. మిగిలిన సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకొవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు స్వాంతన నివ్వడమే కాక, చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా చేస్తుంది.
2. పొదీన ఆకుల్నిమెత్తగా పేస్ట్ చేసి దానికి రోజ్ వాటర్ చేర్చిముఖానికి రాయాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా, మెటిమలు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
3. ముల్లంగిని మొత్తని పేస్టులా చేసుకొని రసం వేరుచేయాలి. దీనికి రెండు * ముల్లంగిని మెత్తని గుజ్జులా చేసి రసం వేరుచేయాలి. దీనికి రెండు టీస్పూన్ పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
4. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
5. జిడ్డు చర్మంగల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేరుచేయాలి. ఇందులో పావుచెంచా నిమ్మరసం, చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాని రోజుకు రెండుసార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మించి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తంది.
6. పొడి చర్మం గలవారు ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్దన చేయాలి. పావుగంట తర్వాత ఈ ప్యాక్ ను తడిదూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications