Latest Updates
-
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.!
నిగారింపు అయిన చర్మానికి కూరగాయలతో ఫేషియల్స్...

1. వేసవిలో ఎండ వేడికి ముఖం నిస్తేజంగా మారటం, కళ్ళు మంట పుట్టడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళాదుంపని సగం వరకు చక్రాల్లా కట్ చేసి నుదురు, కళ్ళపై పెట్టుకోవాలి. మిగిలిన సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకొవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు స్వాంతన నివ్వడమే కాక, చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా చేస్తుంది.
2. పొదీన ఆకుల్నిమెత్తగా పేస్ట్ చేసి దానికి రోజ్ వాటర్ చేర్చిముఖానికి రాయాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా, మెటిమలు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.
3. ముల్లంగిని మొత్తని పేస్టులా చేసుకొని రసం వేరుచేయాలి. దీనికి రెండు * ముల్లంగిని మెత్తని గుజ్జులా చేసి రసం వేరుచేయాలి. దీనికి రెండు టీస్పూన్ పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
4. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
5. జిడ్డు చర్మంగల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా గుజ్జులా చేసి రసాన్ని వేరుచేయాలి. ఇందులో పావుచెంచా నిమ్మరసం, చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాని రోజుకు రెండుసార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మించి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తంది.
6. పొడి చర్మం గలవారు ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్దన చేయాలి. పావుగంట తర్వాత ఈ ప్యాక్ ను తడిదూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications