Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
Nirmala Sitaraman: కేంద్ర ఆర్థికమంత్రి ధరించిన చీర ప్రత్యేకత ఇదే..పెద్ద కథే ఉందిగా
ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీర అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రతీ బడ్జెట్ కి ప్రత్యేకతలు ఉండే చీరలను ధరిస్తున్నారు నిర్మలా సీతారామన్. మనదేశ సంస్కృతి, సంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రదర్శించేలా నిర్మలా సీతారామన్ చీరల్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఆమె చేనేత చీరల్నే ఇష్టపడుతుంటారు. అవే ఎక్కువగా బడ్జెట్ సమయంలో ధరిస్తుంటారు. 2025 బడ్జెట్ వేళ కూడా చేనేతపై ఇష్టాన్ని ప్రదర్శించారు. ఈసారి బీహార్ లోని మిథిలా ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాన్ని తెలిపేలా ఉన్న చీరను ధరించారు.
బంగారు అంచుతో గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువాతో నిర్మలాసీతారామన్ ఇవాళ బడ్జెట్ సందర్భంగా కనిపించారు. ఆమె చీరపై హస్త కళాకారులు ముద్రించిన చేపల ఆర్ట్ ఆకట్టుకుంది. ఇది ప్రఖ్యాతి చెందిన మధుబని ఆర్ట్ కళంకారీ చీరె. బిహార్లోని మధుబని జిల్లా ఈ కళంకారీకి పెట్టింది పేరు.

ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి నిర్మలాసీతారామన్ కు కానుకగా ఇచ్చారు. ఓ కార్యక్రమం నిమిత్తం కేంద్ర ఆర్థికమంత్రి మధుబని వెళ్లినప్పుడు మిథిల ఆర్ట్ ఇన్స్టిట్యూట్ను సందర్శించిన సందర్భంగా దులారీదేవిని కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారీవేవి తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను నిర్మలాసీతారామన్ కి గిఫ్ట్ గా ఇచ్చి బడ్జెట్ రోజున దీనిని ధరించాలని కోరారు.ఇచ్చిన మాట ప్రకారం నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ సందర్భంగా ఈ చీర ధరించారు. కాగా, మధుబని ఆర్ట్స్ తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీ దేవిని 2021 లోనే పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది.
2019లో తొలిసారిగా కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. ఇప్పటివరకు 7సార్లు(2024లో మధ్యంతర, ఓటాన్ అకౌంట్ బడ్జెట్) బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ 8 సార్లు ఆమె ధరించిన చీరల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి 1న కాంతా చీరలోనిర్మలా సీతారామన్ కనిపించారు. అయోధ్యలో అప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో రామా బ్లూ కలర్ చీర ధరించారు. ఈ చేనేత పట్టు చీరపైన గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ ఉంది.



Click it and Unblock the Notifications