శరీర అవయవాలను పాడు చేసే షుగర్ వ్యాధి!

By B N Sharma

Diabetes Can Cause Damage To Body Organs
డయాబెటీస్ ను నియంత్రణలో వుంచకపోతే, శరీరంలో అనేక అవయవాలు పాడైపోతాయి. కళ్ళు, కిడ్నీలు, నరాలు మొదలైనవి తక్షణమే తమ ప్రభావాన్ని చూపుతాయి. రక్త సరఫరా సమస్య అవుతుంది. అత్యధిక రక్తపోటు, అధిక బరువు, కొల్లస్టరాల్ పెరగటం, రక్తనాళాలు గడ్డకట్టి సరఫరా నిదానించడం వంటివి వస్తాయి.

డయాబెటీస్ రోగులకు కంటి వ్యాధి ఎలా నిర్ణయించాలి?
డయాబెటీస్ కళ్ళను గుడ్డిగా కూడా చేయగలదు. సత్వర వైద్యంతో నివారించవచ్చు. ప్రారంభంలో లక్షణాలు తెలియకపోవచ్చు. కనుక కంటి రెటీనా భాగాన్ని పరీక్షించాలి. కంటి డాక్టర్ తో మీకు డయాబెటీస్ వుందని చెప్పాలి.

డయాబెటీస్ రోగులు కాళ్ళకు తీసుకోవలసిన జాగ్రత్తలు!
డయాబెటీస్ నియంత్రణలో లేకుంటే పాదాల సమస్యలు సాధారణం. సమస్య మూడు రకాలు వుంటుంది.
1. డయాబెటీస్ నరాలు పాడు చేస్తుంది. కనుక గాయమైనా తెలియదు.
2. రక్త సరఫరా సరిగా వుండదు కనుక నయమవ్వటం లేటు.
3. షుగర్ నియంత్రణలో వుండదు కనుక ఇన్ ఫెక్షన్ బాగా వ్యాపిస్తుంది.

పాదాలు ఎపుడూ పొడిగా శుభ్రంగా వుంచుకోవాలి. గోళ్ళు కత్తిరించుకోవాలి. క్రీములు రాసి మెత్తగా వుంచాలి.పాదాలు ఎరుపెక్కితే, అతిగా నొప్పి పెడితే, పుండు పడితే, పాదాలు ఉభ్బి రంగుమారితే డాక్టర్ ను సంప్రదించండి. ఆలస్యం చేస్తే పాదాలు తీసివేసే పరిస్ధితి కూడా వస్తుంది.

డయాబెటిక్ రోగుల కిడ్నీ ఎలా పరీక్షించాలి?
కిడ్నీలకు కలిగే డామేజీ వెంటనే తెలియదు. కనుక కనీసం సంవత్సరానికోసారి కిడ్నీలు చెక్ చేయించాలి. దీనికి గాను మూత్రము, బ్లడ్ లో ప్రొటీన్ చెక్ చెసా్తరు. కిడ్నీలు పాడైతే మూత్రంలో ప్రొటీన్ వస్తుంది. అధికంగా ప్రొటీన్ పోతే కిడ్నీ డామేజీ అవుతుంది. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

డయాబెటీస్ వలన జరిగే అవయవ నష్టాలు చాలా తీవ్రంగా వుంటాయి. కనుక మీ శరీరాన్ని ఎప్పటికపుడు చెక్ చేయించుకొంటూ తగిన వైద్యం చేయించుకోవడం సూచించదగినది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, September 19, 2011, 17:02 [IST]
Desktop Bottom Promotion