Latest Updates
-
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.!
బాడీ పెయిన్స్ కి ఎటువంటి ఆహారం తీసుకోవాల్సి..?

2.ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్రపడుతుంది.
3. గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి.
4. బయటకు వెళ్ళినప్పుడు ఆకలివేస్తే దోసకాయలు, కేరెట్ తినడం మంచిది.
5. ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం మంచిది.
6. ప్రతి రోజూ ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు ఖచ్చితంగా తీసుకోండి.
7. ఎలర్జీ వల్ల శరీరంపై దుద్దర్లు ఏర్పడితే ధనియాల కషాయం తాగుతుంటే క్రమంగా తగ్గిపోతాయి.
8. మధుమేహంతో బాధపడేవారు నిత్య ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మేలు. వెల్లుల్లి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
9. దానిమ్మకాయపై తోలును నీళ్లలో అరగదీసి కొద్దిగా మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తాగితే విరోచనాలు తగ్గుతాయి.
10. నిమ్మ ఆకులను రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో పుక్కిలిస్తే పంటొ నొప్పి తగ్గిపోతుంది.
11. బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీటిలో జామాయిల్ ఆకులను వేసి రెండు, మూడు నిమిషాలు ఉంచి, ఆ నీటితో స్నానం చేయాలి.
12. అరగ్లాసు తులసి రసంలో ఒకటిస్పూను తేనె కలుపుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతాయి. రోజుకోసారి చొప్పున ఆరనెలలు తప్పకుండా తాగాలి.
13. ఖర్జూర పండు గుజ్జు తేనెలో కలిపి చంటి పిల్లలకు తినిపిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పళ్ళు వచ్చే సమయంలో తినిపిస్తే చిగుళ్లను గట్టిపడతాయి.
14. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కుగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటిని సమపాళ్ళలో తీసుకోవాలి.
15. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications