Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా!
దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గబెట్టే ముఠాలపై ఏప్రిల్ 17 నుంచి నిఘా పెంచారు. ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వాడకాన్ని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా హోల్సేల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పండ్లను త్వరగా మగ్గబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత పదార్థాల వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి ప్రమాదకర పద్ధతులు పాటించే వ్యాపారులపై అధికారులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.

కెమికల్ మామిడి పండ్లను గుర్తించడం ఎలా? FSSAI కీలక సూచనలు
మీ కుటుంబ ఆరోగ్యం కోసం సహజంగా పండిన మామిడి పండ్లను గుర్తించడం చాలా ముఖ్యం. పండు తొడిమ దగ్గర మంచి సువాసన వస్తుంటే అది సహజంగా పండినట్టు లెక్క. అదే కెమికల్స్తో మగ్గబెట్టిన పండ్లు చూడటానికి నిగనిగలాడుతూ పసుపు రంగులో ఉన్నా, వాటికి వాసన ఉండదు. పండు మొత్తం ఒకే రంగులో కాకుండా అక్కడక్కడా పచ్చగా, అసమానంగా ఉంటే అది మంచి పండు అని గుర్తుంచుకోండి.
పండ్ల పైన ఎక్కడైనా తెల్లటి పౌడర్ లాంటి పదార్థం ఉందేమో గమనించండి. అది ఉందంటే కాల్షియం కార్బైడ్ వాడినట్టే. మరో సులభమైన పద్ధతి ఏంటంటే.. ఒక బకెట్ నీళ్లలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి, కానీ కెమికల్స్తో మగ్గబెట్టినవి నీటిపై తేలుతాయి. ఈ చిన్న చిట్కాలతో మీరు మోసపోకుండా ఉండొచ్చు.
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను శుభ్రం చేయడం ఇంట్లోనే మొదలవ్వాలి. మామిడి పండ్లను తినడానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టండి. దీనివల్ల పైన ఉన్న కెమికల్స్ పోవడమే కాకుండా, పండులోని వేడి కూడా తగ్గుతుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు తక్కువ పరిమాణంలో, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారంతో కలిపి వీటిని తీసుకోవడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మామిడి సీజన్ను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
మామిడి పండ్లను గాలి ఆడే ప్రదేశంలో నిల్వ చేయండి. ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే తేమ పెరిగి పండ్లు త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది. ఎవరైనా వ్యాపారులు అనుమానాస్పదంగా కెమికల్స్ వాడుతున్నట్లు గమనిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తత అందరికీ సురక్షితమైన ఆహారం అందేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications