Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
వంటింటి జాగ్రత్తలు పాటిస్తే ఫలితాలెన్నో

1. వంటగదిలో ఎప్పటి గిన్నెలు అప్పుడే తోముకుంటే సింక్ శుభ్రంగా ఉంటుంది. లేదంటే మర్నాటికి గదిలో దుర్వాసనలు, పురుగుల సమస్య తప్పదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సింక్ ను సాధ్యమైనంత వరకూ పొడిగా ఉంచుకుంటే మంచిది
2. చెత్త బుట్టలను, ప్లాస్టిక్ కర్లలో నింపిన చెత్తచెదారంను వంటగదికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. చెత్తబుట్టలను ఏరోజుకారోజు శుభ్రం చేసుకోవాలి. లేదంటే వాటిలోని క్రిములు, పురుగులు వంటగదిలోని కూరగాయల్లోకి చేరిపోతే వాటి నుంచి హానికర బ్యాక్టీరియా ఇతర పదార్థాలకూ వ్యాపిస్తుంది.
3. నిమ్మజాతి పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో కాస్త వంటసోడా కలిపి చెత్త బుట్టల్లో..గోడలకున్న రంధ్రాల దగ్గర చల్లితే కీటకాలు, పురుగుల బెడద తప్పుతుంది.
4. మధ్యాహ్నామైనా, రాత్రైనా భోజనం చేసిన వెంటనే నేలను కూడా ఊడ్చి..తుడి చేస్తే సరిపోతుంది. లేదంటే ఆహార పదార్థాలు కిందపడి చీమలు, ఈగలు ఇంట్లో చేరిపోతాయి. అవి అనారోగ్యం దారితీస్తాయి.
5. కూరగాయలు పాడైపోతే వాటి నుంచి నీళ్లు, దుర్వాసనలు వస్తుంటాయి. అలానే బాగా పండిన పండ్లలో పురుగులు చేరిపోతాయి. అలాంటి వాటిని వెంటనే పడేయాలి.



Click it and Unblock the Notifications