Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వండే ముందు వెజిటేబుల్స్ , తినేముందు ఫ్రూట్స్ ఎలా శుభ్రం చేయాలి
పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏవైనా సరే, భూమిలో పండిచేవి, నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా లేదా మట్టి ద్వారా కొంత బ్యాక్టీరియా పండ్లు, కూరగాయాలు, ఆకుకూరల మీద చేరుతుంది. ఈ హానీ కరమైన బ్యాక్టీరియాను నివారించడానికి వాటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగి తర్వాత వినియోగించుకోవాలి.
అలా నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా వ్యాపించిన బ్యాక్టీరియాను శుభ్రంగా తొలగించకుడా వినియోగించినట్లైతే అది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. మరియు ఇతర ఆహారాల మీద కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి, మార్కెట్ నుండి తెచ్చినవి ఏవైనా సరే శుభ్రంగా కడిగి తర్వాత వండుకోవాలని తప్పక గుర్తుంచుకోవల్సిన విషయం. హానికర బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రపరచడానికి కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

వెనిగర్: పండ్లు మరియు కూరగాయల మీద చేరిన క్రిములను మరియు బ్యాక్టీరియాను నాశనం చేసే వాటిలో వెనిగర్ ఒకటి. ఒక బకెట్ లో కొద్దిగా వాటర్ నింపి, అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆనీటిలో 5నిముషాలు ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ వేయడం వల్ల బ్యాక్టీరియా మరియు క్రిములు నాశనం అవుతాయి.
బేకింగ్ సోడా : ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ మీద చేరిన పెస్టిసైడ్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించడంలో బేకింగ్ సోడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక బకెట్ లో వాటర్ నింపి, అందులో ఒక 4 చెంచాలా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ నీటిలో వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసి, తిరిగి మంచి నీటితో కడిగి ఉపయోగించుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి.

పసుపు: పసుపులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కూరలు, పండ్లలోని క్రిములను చాలా ఎఫెక్టివ్ గా నానశనం చేస్తుంది . పంటలను పండించే వ్యవసాయధారులు క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వల్ల, ఆ క్రిమిసంహారక ముందులు పండ్లు, కూరగాయల మీద అలాగే ఉండి పోతాయి. కాబట్టి వీటికి శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవడం మంచిది.
సాల్ట్ : రాళ్ళ ఉప్పు ను లేదా సాల్ట్ నీటిలో వేసి అదులో ఫ్రూట్స్ మరియు వేజిటేబుల్స్ వేసి, 10 నిముషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ ను తిరిగి మంచినీటితో శుభ్రం చేయడం వల్ల క్రిమిసంహారక మందులు, క్రిములు నాశనం అవుతాయి.

వడేటప్పుడు లేదా తినేటప్పుడు తొక్కను తొలగించడం మంచిది: ఇంట్లోనే పండ్లు మరియు కూరలు నేచురల్ గా క్లీన్ చేయడానికి పెస్టిసైడల్ రిమూవల్ చిట్కాలు గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే అందుకు ఎప్పుడూ వెజిటేబుల్స్ కానీ, పండ్ల మీద కానీ ఉండే స్కిన్ తొలగించి వినియోగించుకోవడం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్యకరం...



Click it and Unblock the Notifications











