జ్ఞానోదయ కధ

The Story Of Enlightenment
ఎంగాకు పట్టణంలోని జెన్ మాస్టర్ బుక్కో కింద తన విద్య నభ్యసించిన సన్యాసిని షియోనో కు ధ్యాన ఫలితాలు దీర్ఘ కాలం తర్వాత లభించాయి. ఆమెకు అకస్మాత్ గా జ్ఞానోదయం అయింది. అది కూడా చక్కని వెన్నెల కలిగిన నాటి రాత్రి ఆమె వెదురుతో చేయబడిన బుట్ట బాల్చీతో నీరు తెస్తూండగా కలిగింది.

అయితే, అకస్మాత్ గా ఆ వెదురు బుట్ట పగిలి నీరు కిందపోయింది. అదే క్షణంలో సన్యాసి షియోనోకు స్వేచ్ఛ లభించింది. ఆ క్షణాన్ని ఆమె ఒక మంచి సంఘటనగా గుర్తించి వెంటనే ఒక పద్యం వ్రాసుకుంది.

వెదురు ముక్క బాగా బలహీనపడి విరిగిపోయేలా వుంది
చిట్ట చివరకు దాని అడుగు క్రిందపడేవరకు.
బాల్చీలో ఇక నీరు లేదు!
నీటిలో చంద్రుడు ఇక కనపడటంలేదు!
ఈ విధంగా నేను ఆపాత బాల్చిని కాపాడాను.

Story first published: Thursday, July 5, 2012, 14:58 [IST]
Desktop Bottom Promotion