Latest Updates
-
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.!
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.!
సాధారణంగా కొత్త జంటలు హనీమూన్ కోసం వెకేషన్ ప్లానింగ్ చేసుకోవవడం తెలిసిందే. ప్రైవేట్ స్పేస్ ఉండేలా హోటల్ రూమ్స్, కొత్త ప్రాంతాలు లేదంటే ఇంట్లోనే ప్రత్యేకంగా రూమ్ను డెకరేట్ చేసుకుంటారు. అయితే పబ్లిక్ రవాణాలో ఎప్పుడైనా హనీమూన్ సెటప్ చూశారా.? రైల్వే ఏసీ కోచ్లో మొదటి రాత్రి కోసం చేసిన డెకరేషన్ వీడియో వైరల్ అవుతోంది.

భారతీయ రైల్వేలోని ఫస్ట్ ఏసీ కోచ్లో హనీమూన్ సెటప్ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఈ వీడియో రైల్వే నిబంధనలు, భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రైన్లోని ఒక ఫస్ట్ ఏసీ కోచ్ కంపార్ట్మెంట్ విలాసవంతమైన హోటల్ గదిని తలపిస్తోంది. అందులోని ఒక క్యాబిన్లో బెడ్పై పూల డెకరేషన్, గులాబీ రేకులు, రంగురంగుల బెలూన్లతో మొదటి రాత్రి గదిని తలపించేలా డెకరేషన్ చేశారు. దీంతో గోడపై 'ఐ లవ్ యూ’ అంటూ ఇంగ్లీష్ రాయడం కొత్త జంటలకు మధురానుభూతిని ఇచ్చేలా ఉంది.
అయితే ఈ వీడియోను మొదటి నుంచి కాకుండా డెకరేట్ చేసిన క్యాబిన్ను డైరెక్ట్గా చూసినట్లయితే ఇది రైల్లోనే అస్సలు నమ్మలేరు. ఇలాంటి క్రియేటివ్ ఐడియా నెటిజన్లను ఆకట్టుకున్నప్పటికీ.. మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్టులో ఇలాంటి చర్యలేంటని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రయాణికుల భద్రత, పరిశుభ్రతకి సంబంధించి ప్రశ్నలు మొదలయ్యాయి.
రైల్వే వ్యవస్థపై ప్రభావం
భారతీయ రైల్వే వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టులో బెలూన్లు, కాగితం, పూలు, కొవ్వొత్తులు వంటివి ఉపయోగించడం భద్రతకు ముప్పు వాటిల్లినట్లు కాదా అని నెటిజన్స్ పేర్కొంటున్నారు. క్యాబిన్లో ఇవి ఉండటం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. వీరిని చూసి మరో ప్రయాణికుడు కూడా ఇదేవిధంగా ప్లాన్ చేస్తే అది రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నూతన భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వడం మధుర జ్ఞాపకం, అద్భుతమైన బహుమతి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైల్వే కోచ్లను ఇలా అలకరించడం చట్టబద్ధమేనా అని మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇందుకోసం ముందుగా రైల్వే అనుమతి తీసుకున్నారా.. రైల్వే శాఖలో ఇలాంటి అనుమతులు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న క్యాబిన్ను ఇలా అలంకరించుకోవచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే శాఖ స్పందన
ఈ విషయం రైల్వే శాఖ దృష్టికి చేరడంతో అధికారులు దీనిపై స్పందించారు. ఈ సంఘటన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరిగిందని.. అయితే ఈ కోచ్లోకి డెకరేటర్ అనుమతి లేకుండా ప్రవేశించడం అనధికారమని తెలిపారు. రైల్వే నియమాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.
’జల్నా స్టేషన్లో కోచ్లోకి డెకరేటర్ ప్రవేశం అనధికారికం. ఇది తీవ్రమైన లోపం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత టీటీఈని సస్పెండ్ చేశాం. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాం. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం.’- అని అధికారులు తెలిపారు.
ఈ మేరకు క్యాబిన్లో అలంకరణలు చేపట్టిన కాంట్రాక్టర్పై.. ట్రైన్లోకి అనధికారికంగా ప్రవేశించడం, టికెట్ లేకుండా రావడం, రైల్వే నిబంధనలను అతిక్రమించడంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, భద్రతా నిబంధనలను పాటించి, డెకరేట్ చేసుకోవడం, తర్వాత సరిగ్గా శుభ్రపరిస్తే ఎలాంటి తప్పు లేదని అధికారులు తెలిపారు. అప్పుడప్పుడూ ప్రత్యేక సందర్భాల కోసం ఫస్ట్ ఏసీ కోచ్లలో తేలికపాటి అలంకరణలు అప్పుడప్పుడు కనిపిస్తాయన్నారు. అయితే అనధికార వ్యక్తులకు లోపలికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.



Click it and Unblock the Notifications